Skip to main content

అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా

అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా
అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా

సాధారణంగా నందమూరి బాలకృష్ణను చూస్తే ఎవరినీ పెద్ద లెక్క చేయనట్లు కనిపిస్తాడు. అంటే నెగటివ్ గా కాదు కానీ డేరింగ్ అండ్ డాషింగ్ అనే భావన కలిగిస్తాడు. అయితే ఒక నటుడు అందులోనూ 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఉండే పాత్ర చేయను అన్నాడని తెలిసి ఆ ప్రాజెక్టుని ఆపేసాడు బాలయ్య. ఒకసారి ఆ విషయాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ రైతుల కష్టాల నేపథ్యంలో రైతు అనే స్టోరీ సిద్ధం చేసుకుని వెళ్లి వినిపించాడు. బాలయ్య కూడా ఆ కథకు ఇంప్రెస్ అయ్యాడు. అయితే ఈ కథలో ఒక 10 నిముషాలు పాటు రాష్ట్రపతి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర కోసం అమితాబ్ అయితేనే సరిపోతాడని బాలయ్య భావించాడు. అతను ఒప్పుకుంటేనే ఈ సినిమా ఉంటుందని ముందే కృష్ణవంశీకి చెప్పాడు.

అప్పట్లో బాలకృష్ణ, కృష్ణ వంశీ అమితాబ్ ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసారు. అయితే కారణాలు బయటకు రాలేదు కానీ అమితాబ్ మాత్రం ఈ సినిమా చేయలేనని చెప్పేసాడు. అమితాబ్ తప్పితే వేరే వాళ్ళు ఈ పాత్ర చేయలేరు అంటూ బాలయ్య అన్న మాట ప్రకారంగానే ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. రీసెంట్ గా రూలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రైతు కథ ప్రస్తావన వచ్చినప్పుడు ఇక ఆ ప్రాజెక్ట్ ఉండబోదు అన్నట్లుగా మాట్లాడాడు. రైతు కథ తనకెంతో నచ్చిందని, కచ్చితంగా సినిమా చేయాలనుకున్నానని, అయితే ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒక సూపర్ స్టార్ ను అనుకున్నామని కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని చెప్పేసాడని, దాంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చిందని అన్నాడు బాలకృష్ణ.

ఈ మాత్రం దానికే సినిమా పక్కన పెట్టేయాలా అనిపించొచ్చు. కానీ బాలయ్య తరహానే అంత. పాత్రకు తగ్గ నటీనటులు దొరక్కపోతే తాను సినిమాలు చేయలేనని చెప్పుకొచ్చాడు బాలయ్య. తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా చేద్దామనుకున్నామని, అయితే అప్పుడే సౌందర్య చనిపోవడంతో ఇక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.

ఇదంతా బానే ఉంది కానీ, సైరాలో అతి చిన్న పాత్ర వేయడానికి ఒప్పుకున్న అమితాబ్, రైతు విషయంలో మాత్రం బిజీ షెడ్యూల్ అని చెప్పడమేంటో. వారం రోజుల కాల్ షీట్స్ తో అయిపోయే ఈ చిత్రానికి నో చెప్పడానికి వేరే కారణాలు ఉండుండాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sT5CV6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...