Skip to main content

రష్మిక మహేష్ ఫ్యాన్స్ కు మంటెక్కించిందిగా!

రష్మిక మహేష్ ఫ్యాన్స్ కు మంటెక్కించిందిగా!
రష్మిక మహేష్ ఫ్యాన్స్ కు మంటెక్కించిందిగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక టెరిఫిక్ యాక్టర్. ఈ స్టేట్మెంట్ లో అసలు మరో మాట లేదు. ఎమోషనల్ సీన్స్ అయినా, కామెడీ అయినా, యాక్షన్ అయినా మహేష్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడు. కళ్ళతో ఇంటెన్సిటీ పలికించగల అతికొద్ది మంది నటుల్లో మహేష్ ఒకడు. అయితే ప్రతి హీరోకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మహేష్ కు కూడా ఉంది. అదే డ్యాన్స్. అల్లు అర్జున్, తారక్, చరణ్ లలా మహేష్ ఏమీ టెరిఫిక్ డ్యాన్సర్ కాడు. అయితే మరీ తీసికట్టుగా కూడా లేకుండా ఏదో అలా మ్యానేజ్ చేస్తూ బండి లాగించేస్తుంటాడు. మహేష్ స్వయంగా తాను డ్యాన్స్ లో వీక్ అని ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మహేష్ ఒక్కడే కాదుగా, ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు డ్యాన్స్ లో వీక్ ఉంటారు. అలాగే డ్యాన్స్ బాగా వచ్చిన తారక్, బన్నీ, చరణ్ లకు వేరే విషయాల్లో వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఎవరూ బయటకు చెప్పుకోరు. ఏవో ఫ్యాన్స్ కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప వీటి గురించి ప్రస్తావన అనవసరం.

అయితే ఇప్పుడు రష్మిక తెలిసి చేసిందో తెలీక చేసిందో కానీ మహేష్ ఫ్యాన్స్ కు మంటెక్కించే పనే చేసింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019లో తన సినిమాల గురించి స్పందించింది. ఆ సమయంలో సరిలేరు నీకెవ్వరు గురించి మాట్లాడుతూ మహేష్ డ్యాన్సింగ్ ఎబిలిటీతో నేను ఎంత వరకూ మ్యాచ్ చేసానో తెలీదు, నా వరకూ రిహార్సల్స్ బాగా చేసుకున్నా అని చెప్పింది. ఈ విషయంపై మహేష్ ఫ్యాన్స్ ను ఆడుకుంటున్నారు మిగతా వాళ్ళు. మహేష్ డ్యాన్స్ పై ట్రోల్స్ వీడియోస్ ను రష్మికకు ట్యాగ్ చేస్తూ దీని గురించేనా చెప్పేది? అంటూ పోస్ట్స్ పెట్టారు. ఇంకొంత మంది అయితే మహేష్ కే ఇలా అయిపోతే అలా తర్వాత చేయాల్సింది అల్లు అర్జున్ తో. అప్పుడేమంటావో అని డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు.

ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఫ్యాన్స్ వార్స్ కు తెరతీస్తోంది. మహేష్ ను ఈ విషయంలో ట్రోల్స్ చేస్తుంటే, మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? మెగా ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పరంగా కొంత వీక్ కాబట్టి తన డ్యాన్స్ పై ఉన్న ట్రోల్స్ ను హైలైట్ చేస్తున్నారు. ఇలా రష్మిక ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ ఇంత రగడకు కారణమైందన్నమాట.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2t8yMj1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...