Skip to main content

ఆ దర్శకుడు తెలుగు హీరోకే ఫిక్స్ అయ్యాడు!

ఆ దర్శకుడు తెలుగు హీరోకే ఫిక్స్ అయ్యాడు!
ఆ దర్శకుడు తెలుగు హీరోకే ఫిక్స్ అయ్యాడు!

కెజిఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పైకి అందరి దృష్టి మళ్లేలా చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మనకు బాహుబలి ఎలాగో, కన్నడ వాళ్లకు కెజిఎఫ్ అలా ప్రతిష్టాత్మక చిత్రంగా మిగిలిపోయింది. ఆ సినిమా భారీతనం, ప్రశాంత్ నీల్ హ్యాండిల్ చేసిన విధానం, హీరోను ప్రెజంట్ చేసిన తీరు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెటప్ అంతా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాయి. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కు కొనసాగింపుగా కెజిఎఫ్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. వచ్చే వేసవికి ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ప్రమోషన్స్ కు మరో రెండు నెలలు వేసుకుని సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇది పక్కన పెడితే టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మనవాళ్ళు వాలిపోతారు. కెజిఎఫ్ విడుదలైన వెంటనే ప్రశాంత్ నీల్ పై మన టాప్ హీరోల దృష్టి పడింది. దాదాపు అందరి నుండి తమకేమైనా సూట్ అయ్యే కథ ఉందా అంటూ వాకబు చేయించడం మొదలుపెట్టారు. ప్రశాంత్ నీల్ కూడా తక్కువ వాడేమి కాదు. కన్నడ కంటే తెలుగు ఇండస్ట్రీ అయితే తనకు ఎక్స్పోజర్ బాగుంటుంది, పైగా కన్నడలో కూడా విడుదల చేసుకోవచ్చు అనుకుని వాకబు చేసిన అందరికీ ఎస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఇలా ముగ్గురితోనూ ప్రశాంత్ టచ్ లోనే ఉన్నాడట. నెల క్రితమే హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ను కలిసి దాదాపు గంట కలిసి వెళ్ళాడు. అంతకు ముందు కూడా మహేష్ తో ఇలాంటి మీటింగే జరిగింది. అసలు మహేష్ బాబు 27వ సినిమా ప్రశాంత్ నీల్ తోనే ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.

ప్రస్తుతానికి ఈ వార్తలపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా తాజాగా మరో రూమర్ మొదలైంది. ప్రశాంత్ నీల్ ఈ ముగ్గురు హీరోలతోనూ సినిమాలు చేసే అవకాశం ఉందిట. ముందుగా ఎన్టీఆర్ తో, తర్వాత మహేష్ తో, ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందన్నది ప్రాధమికంగా తెలిసింది. మైత్రి వాళ్ళ దగ్గర నుండి ప్రశాంత్ నీల్ అడ్వాన్స్ పుచ్చేసుకున్నాడు కూడా. మరి మైత్రి వాళ్లతో ప్రశాంత్ చేయబోయే సినిమాలో హీరో ఎవరో తెలీదు. అలాగే మిగతా ఇద్దరు హీరోలతో చేసే సినిమాలకు కూడా నిర్మాతలు ఎవరన్నది తేలాల్సి ఉంది.

అయితే ప్రశాంత్ నీల్ వర్కింగ్ తీరు బట్టి చూస్తే సినిమాకు సినిమాకు మధ్య కనీసం ఏడాది గ్యాప్ తీసుకుంటాడు. అంటే ఎన్టీఆర్ సినిమా మొదలవ్వాలంటే అది 2021లోనే సాధ్యమవుతుంది. ఇక ఈ ముగ్గురితో సినిమాలు పూర్తి చేయాలంటే ఒక ఆరేళ్ళు వేసుకోవాల్సిందే. అయితే ఇదంతా జరిగే పనేనా అన్నది అసలు ప్రశ్న. చూస్తుంటే ఇవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు. మరి కెజిఎఫ్ 2 విడుదలైతే కానీ ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YwzZMN

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...