Skip to main content

రూలర్ మూవీ రివ్యూ

రూలర్ మూవీ రివ్యూ
రూలర్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: రూలర్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు
నిర్మాత: సి కళ్యాణ్
దర్శకత్వం: కెఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
మ్యూజిక్: చిరంతన్ భట్
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019
రేటింగ్: 2.5/5

ఈ ఏడాది రెండు ప్లాపులతో డీలాపడ్డ నందమూరి అభిమానులకు బాలకృష్ణ రూలర్ అంటూ మరో సినిమాను అందించాడు. అయితే ట్రైలర్, ప్రోమోలు అన్నీ ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమాను చూడబోతున్నామన్న భావనను కలిగించాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉందో చూద్దాం.

కథ:
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అర్జున్ ప్రసాద్ (నందమూరి బాలకృష్ణ), జయసుధకు వారసుడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళితే అక్కడ సోనాల్ చౌహన్ తారసపడుతుంది. మొదట ద్వేషించినా సోనాల్, అర్జున్ ప్రసాద్ కు పడిపోతుంది. వారి పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, అర్జున్ ప్రసాద్ కు, భవానీ నాథ్ అనే వ్యక్తితో గొడవ జరుగుతుంది. అర్జున్ ప్రసాద్ మీద అటాక్ చేయిస్తాడు భవానీ. అక్కడ కొన్ని ఊహించని పరిణామాలు అర్జున్ కు ఎదురవుతాయి. అతణ్ణి అందరూ ధర్మ అని పిలవడం మొదలుపెడతారు. అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అర్జున్ కు ఏమైనా గతముందా? వంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
ముందుగా నందమూరి బాలకృష్ణ గురించే ప్రస్తావించుకోవాలి. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు. సినిమా అంతటా ఆయన చూపించిన ఎనర్జీకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అటు డ్యాన్సుల్లో కానీ ఇటు ఫైట్స్ లో కానీ బాలయ్య ఎక్కడా తగ్గలేదు. తనకలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సీఈవోగా బాలయ్య లుక్ అదిరిపోయింది. సోనాల్ చౌహాన్ గ్లామర్ పరంగా తనను తీసుకున్నందుకు పూర్తి న్యాయం చేసింది. ఆమె తన స్కిన్ షో తోనే జనాలను ఆకర్షిస్తుంది. పాత్ర పరంగా చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించిన వేదిక ఆకట్టుకుంటుంది. అటు గ్లామరస్ గా ఉంటూనే, ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో మెప్పించింది. నాగినీడు, ప్రకాష్ రాజ్, జయసుధ తమకలావాటైన పాత్రలే కాబట్టి ఆకట్టుకుంటారు. భూమిక కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. సప్తగిరి, సాయాజీ షిండే, ధనరాజ్, శ్రీనివాస రెడ్డి వంటి వారు కామెడీ చేయడానికి బాగా కష్టపడ్డారు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫైట్స్ కూడా ఒక స్థాయి వరకూ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చిరంతన్ భట్ పాటలు, నేపధ్య సంగీతం మెప్పిస్తాయి. పరుచూరి మురళి ఈ సినిమాకు ముతక కథను అందించాడు. ఇప్పటికే వందల సినిమాల్లో ఈ టైపు కథలను చూసేసాం. సంభాషణలు మెప్పిస్తాయి. ముఖ్యంగా రైతుల కష్టాల మీద రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా కెఎస్ రవికుమార్ అవుట్ డేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. మూస ఫార్మాట్ లోనే సినిమాను నడిపించాడు. కమర్షియల్ సినిమా అనగానే పాట, ఫైటు అన్న తరహాలో ఉండాలని భావించి అదే వే లో సినిమాను తీసుకెళ్లారు.

చివరిగా:
రూలర్ ఆశించినట్లుగానే రొటీన్ గానే ఉంది. ట్రైలర్ లో చూస్తేనే కథ మీద ఒక అంచనాకు రావొచ్చు. అంతకు మించి ఈ కథలో ఏం లేదు. అయితే బాలయ్య ఈ సినిమాను లేపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ధర్మగా బాలయ్య అదరగొడతాడు, అయితే ఆ పాత్ర లుక్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్ధం కాదు. మొత్తంగా రూలర్ బాలయ్య అభిమానులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైట్లు, గ్లామర్ విందు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం బి, సి సెంటర్ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కాగల ఈ చిత్రం ఒక సగటు మాస్ మసాలా సినిమాగా మిగిలిపోతుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EznyXe

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...