Skip to main content

విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?
విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. టాలీవుడ్‌లో ఓ సెన్సేష‌న్‌. స్టార్‌ల‌కే దిమ్మ‌దిరిగే ప‌బ్లిసిటీ ప్లానింగ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. వ‌రుస క్రేజీ చిత్రాల‌తో డైన‌మిక్ హీరోగా దూసుకుపోతున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌త్డ్ ఫేమ‌స్ అవ‌ర్‌`. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌. రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ. వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టే సినిమా ప్ర‌మోష‌న్‌ని కూడా మేక‌ర్స్ డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసిన‌ట్టున్నారు. అందులో భాగంగానే వ‌రుస ఫ‌స్ట్‌లుక్‌ల‌ని రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండకు జోడీగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యారాజేష్‌, కేథ‌రిన్‌, ఇజ‌బెల్లా లిల‌యితే న‌టిస్తున్నారు. ఒక్కో హీరోయిన్‌తో విజ‌య్ డిఫ‌రెంట్ లుక్‌లో వున్న లుక్‌ల‌ని ఈ నెల 12 నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఐశ‌ర్వార్యా రాజేష్‌తో రిలీజ్ చేసిన లుక్‌లో విజ‌య్ మ‌ధ్య త‌ర‌గ‌తి భ‌ర్త‌గా క‌నిపిస్తున్నాడు. ఆ త‌రువాత ఫ్యాన్స్ న‌టి ఇజ‌బెల్లాతో వున్న లుక్‌లో మోడ్ర‌న్ ప్రేమికుడిగా విజ‌య్ క‌నిపిస్తున్నారు. కేథ‌రిన్‌తో క‌లిసి వున్న లుక్‌లో సింగ‌రేణి కార్మికుడిగా క‌నిపించిన విజ‌య్ తాజాగా రాశిఖ‌న్నాతో రిలీజ్ చేసిన స్టిల్ మ‌రింత యంగ్‌గా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు.

ఈ నాలుగు లుక్స్ లే దేఇన క‌దే డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తూ ఇంత‌కీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా లేక న‌లుగురా అన్న అనుమానం క‌లిగిస్తోంది. ఇక పాత్ర‌కో పేరు వుండ‌టంతో ఆ అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. అయితే చిత్ర బృందం మాత్రం అది మాత్రం సీక్రెట్ అని చెబుతోంది. జ‌న‌వరి 3న టీజ‌ర్ రిలీజ్ కాబోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YUguh9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...