Skip to main content

టాప్ స్టార్‌ల‌ని వెన‌క్కి నెట్టిన బాహుబ‌లి!

టాప్ స్టార్‌ల‌ని వెన‌క్కి నెట్టిన బాహుబ‌లి!
టాప్ స్టార్‌ల‌ని వెన‌క్కి నెట్టిన బాహుబ‌లి!

రాజ‌మౌళి `బాహుబ‌లి`తో ప్ర‌భాస్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన `సాహో` కూడా ఆ క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ ప్ర‌భాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిల‌బెట్టింది. దీంతో ప్ర‌భాస్ వైపు యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఆస‌క్తిగా చూడ‌టం మొద‌లుపెట్టింది. `బాహుబ‌లి` విజ‌యంతో ఇండియాలోని టాప్ స్టార్‌ల జాబితాలో చేరిపోయిన ప్ర‌భాస్ తాజాగా మ‌రో అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. 2019 సంస‌వ‌త్స‌రానికి గానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో అత్య‌తం ప్ర‌భావ‌వంత‌మైన 100 మంది జాబితాతో పాటు వారు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారో ఫోర్బ్స్ ఇండియా ప్ర‌క‌టించింది.

ఈ జాబితాలో బాహుబ‌లి ప్ర‌భాస్ (35 కోట్ల‌) 44వ స్థానంలో నిలిచారు. గ‌త ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కిని ప్ర‌భాస్‌కు ఈ ద‌ఫా ద‌క్క‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. గ‌త ఏడాది ప్ర‌క‌టించిన లిస్ట్‌లో 33వ స్థానంలో నిలిచిన మ‌హేష్ (35 కోట్లు) ఈ ద‌ఫా 54వ స్థానానికి ప‌డిపోయారు. అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ (21.5 కోట్లు) తొలిసారి 77వ స్థాన్ని ద‌క్కించుకున్నారు. అయితే ఈ జాబిలోని మొద‌టి స్థానంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (252.72 కోట్లు) నిలిచారు. అక్ష‌య్‌కుమార్ 293.25 కోట్లతో రెండ‌వ స్థానాన్ని ద‌క్కించుకోగా గ‌తేడాది రెండ‌వ స్థానంలో నిలిచిన స‌ల్మాన్‌ఖాన్ 229. 5 కోట్ల‌తో మూడ‌వ స్థానానికి ప‌డిపోయారు.

మిగ‌తా స్థానాల్లో ల‌మితాబ్ 239 కోట్లు, మ‌హేంద్ర సింగ్ ధోని 135. 93 కోట్లు, షారుఖ్‌ఖాన్ 124. 38 కోట్లు, ర‌ణ్‌వీర్‌సింగ్ 118.2 కోట్లు, అలియాభ‌ట్ 59.21 కోట్లు, స‌చిన్ టెండూల్క‌ర్ 76 కోట్లు, దీపికా ప‌దుకోన్ 48 కోట్లతో టాప్ 10 జాబితాలో నిలిచారు. ఆ త‌రువాత స్థానాల్లో ర‌జ‌నీకాంత్‌, ర‌జ‌నీకాంత్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, ఆమీర్‌ఖాన్‌, రెహ‌మాన్‌, హృతిక్ రోష‌న్ త‌దిత‌ర‌లు నిలిచారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35CFsUJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...