Skip to main content

హీరో సిద్ధార్థ్ అడ్డంగా బుక్కాయ్యారు!

Police case filed against hero Siddharth
Police case filed against hero Siddharth

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ల‌వ‌ర్ బాయ్‌గా పేరుతెచ్చ‌కున్న సిద్ధార్థ త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. తెలుగులోనూ త‌న దూకుడు స్వ‌భావం కార‌ణంగా మీడియాకు దూర‌మైన సిద్ధార్ధ్ ఆ త‌రువాత తెలుగు చిత్రాల్లో క‌నిపించ‌కుండా పోయారు. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే తెలుగులో త‌న అనువాద చిత్రాల ద్వారా వ‌స్తున్న సిద్ధార్థ్ గ‌తంలో చెన్నైలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌పై కూడా  స్పందించి సంచ‌ల‌నం సృష్టించారు. చెన్నైలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల కార‌ణంగా త‌న ఇల్లు కూడా మునిగిపోయింద‌ని, త‌న ప‌రిస్థితే ఇలా వుంటే ఇక సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో త‌మిళ మీడియాలో సిద్ధార్థ్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అధికార పార్టీ నాయ‌కులు కూడా సిద్ధార్థ‌పై కామెంట్‌లు చేయ‌డంతో వాతావ‌ర‌ణం వేడెక్కింది. గ‌త కొంత కాలంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నఆయ‌న దాదాపుగా తెలుగులో త‌న క్రేజ్‌ని కోల్పోయారు. ఇటీవ‌ల డ‌బ్బింగ్ సినిమా `వ‌ద‌ల‌డు` చిత్రంతో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సిద్ధార్ధ్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

పౌర‌స‌త్వ బిల్లు కార‌ణంగా దేశ వ్యాప్తంగా నిర‌స‌నలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ముఖులు, మేధావులు నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. తాజాగా చెన్నైలోని వ‌ళ్లువార్ కొట్టాంలో విద్యార్థి సంఘాలు, ప‌లు రాజ‌కీయ నాయ‌కులు, మ‌హిళ‌లు భారీ యెత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. అయితే ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌సిద్ధార్థ్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వ‌ళ్లువార్ కొట్టాయం పోలీసులు కేసు న‌మోదుచేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సిద్ధార్థ్‌తో పాటు 600 మంది విద్యార్థులు, ఎంపీ తిరుమా వ‌ళ‌వ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జ‌వ‌హ‌రుల్లాపై 144 సెక్ష‌న్‌తో పాటు ప‌లు సెక్ష‌న్‌ల కింది కేసు న‌మోదు చేయ‌డం త‌మిళ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Z7qpjw

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...