Skip to main content

అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య వార్ నిజమేనా?

Daggubati and Akkineni fans cold war over Venky Mama
Daggubati and Akkineni fans cold war over Venky Mama

మన స్టార్ హీరోలు అందరూ ఒకరంటే ఒకరు అభిమానంగానే ఉంటారు. ప్రతిసారి రాసుకుని పూసుకుని తిరిగరు కానీ కలిసినప్పుడు మాత్రం ఆప్యాయంగా పలకరించుకోకుండా ఉండరు. కలిసి హాలిడే ట్రిప్ లకు కూడా వెళుతుంటారు. ఒకరి ఫంక్షన్ లకు ఒకరు అటెండ్ అవుతుంటారు. ఇలా ఎన్ని చేస్తున్నా కూడా ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగట్లేదు. డైరెక్ట్ గా స్టేజ్ మీదే మేము మేము బానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి అని స్టార్ హీరోలు చెబుతున్నారంటే ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మాములు హీరోల మధ్య ఫ్యాన్స్ వార్స్ ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ రెలెటివ్స్ అయిన హీరోల ఫ్యాన్స్ మధ్యన కూడా ఇలాంటి ఫ్యాన్స్ వార్స్ ఉండడం విచిత్రమే.

అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్.. ఈ ఇద్దరూ రిలేటివ్స్ అన్న సంగతి అందరికీ తెల్సిందే. వరసకు నాగార్జునకు వెంకటేష్ బావ మరిది అవుతాడు. అయితే నాగార్జున తన మొదటి భార్య నుండి విడిపోయి విడాకులు తీసుకున్నాడు. రెండు వైపులా ఫ్యామిలీస్ ఈ విషయంలో ఇద్దరికీ అండగా నిలబడ్డాయి. ఇలాంటి ఒక సంఘటన జరిగినా వెంకటేష్, నాగార్జున ఎప్పుడూ క్లోజ్ గానే ఉన్నారు. బయట ఫంక్షన్స్ లో కూడా సౌకర్యంగానే కలుస్తారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం పరిస్థితి అలా లేదు. అక్కినేని ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది.

అక్కినేని నాగ చైతన్య తన మావయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చేసిన విషయం తెల్సిందే. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు కట్టిన బ్యానర్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్యన కోల్డ్ వార్ అర్ధమవుతుంది. నాగ చైతన్యకు బ్యానర్ లో నాగార్జున మరియు ఇతర అక్కినేని హీరోలు ఉంటున్నారు కానీ వెంకటేష్ కు స్థానం ఇవ్వట్లేదు. అలాగే వెంకటేష్ ఉన్న బ్యానర్ లో రానా ఉన్నాడు కానీ నాగ చైతన్యకు స్థానం లేదు.

సిటీల్లో ఇది తక్కువే ఉన్నా ఊర్లలో ఇంకా ఈ ఫీలింగ్ ఎక్కువే ఉంది. ఇలా ఇద్దరు హీరోలను కలిపి ఒక పోస్టర్ మీదే చూడలేని ఈ ఫ్యాన్స్ ఇక సినిమాను ఎలా చూస్తారు?.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LNbs0u

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...