Skip to main content

మెగా కాంపౌండ్ లో స్క్రిప్ట్ లు కావలెను

Mega compound looking for right scripts
Mega compound looking for right scripts

మల్టీస్టారర్ కు ఉండే క్రేజ్ మాటల్లో వర్ణించలేనిది. రీసెంట్ గా విడుదలైన వెంకీ మామ చిత్రం దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తోంది. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోవడానికి ప్రధానం కారణం మల్టీ స్టారరే అనడానికి సందేహం అక్కర్లేదు. వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ కే రెస్పాన్స్ ఇలా ఉంటే.. ఇక క్రేజ్ లో వీరికంటే ఎక్కువలో ఉన్న మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ఈ కాంబినేషన్లలో ఏదైనా కాంబినేషన్ తో మల్టీ స్టారర్ సెట్ అయిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే చిరు-పవన్, చిరు-చరణ్, పవన్-చిరు కాంబినేషన్ లో సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. ఇకపై కూడా జరుగుతాయి.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం మాత్రం ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం సరైన స్క్రిప్ట్ లేకపోవడమే. ఇప్పటికే చిరంజీవి- పవన్ కళ్యాణ్ హీరోలుగా సినిమా చేయబోతున్నట్లు టిఎస్సార్, అశ్విని దత్ లాంటి వాళ్ళు అధికారిక ప్రకటన జారీ చేసారు. ఇక సినిమా తొందర్లోనే అన్నట్లుగా ఊదరగొట్టేసారు. అయితే అటువంటి ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. అవి ప్రకటనల రేంజ్ తోనే ఆగిపోయాయి. ఇవి మాత్రమే కాకూండా పవన్ కళ్యాణ్ నిర్మాతగా చరణ్ హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు ఒక వార్త అప్పట్లో హల్చల్ చేసింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. సరైన కథతో దర్శకులు ఎవరైనా వస్తే చరణ్ తో తాను సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అలాగే చరణ్ కూడా కథ నచ్చితే పవన్ తో సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమా చేస్తామని చెప్పాడు. ఇక చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా కూడా ఒక సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి.

అయితే వీటిలో ఏది జరగాలన్నా ముందుగా కావాల్సింది వారి ఇమేజ్ లకు సరిపోయే కథ. అదంటూ ఒకటి లాక్ అయిపోతే ఎలాంటి కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి అయినా మెగా కాంపౌండ్ సిద్ధంగా ఉంది. అందుకే అనేది మెగా కాంపౌండ్ లో స్క్రిప్ట్ లు కావలెను అని.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YUsgIh

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...