Skip to main content

తారక్ అటు వెళ్తే.. చరణ్ ఇటు వస్తాడట!

తారక్ అటు వెళ్తే.. చరణ్ ఇటు వస్తాడట!
తారక్ అటు వెళ్తే.. చరణ్ ఇటు వస్తాడట!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలకు ప్రతి విషయంలోనూ కాంపిటీషన్ వస్తోన్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలూ కూడా సంక్రాంతి సందర్భంగా ఒకరోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానుండగా, అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కాబోతోంది. ఇలా ఒకరోజు వ్యవధిలో రెండు పెద్ద చిత్రాలు విడుదల కానుండడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రాలపైనే ఎక్కువగా ఉంది. ఇక ఈ రెండు చిత్రాలు కూడా ప్రతి విషయంలో ఒక దాంతో ఒకటి పోటీ పడుతూ అటు ఫ్యాన్స్ కు, ఇటు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారాయి. రిలీజ్ డేట్ విషయంలోనే కాక, ప్రమోషనల్ యాక్టివిటీస్ పరంగా కూడా ఈ రెండు చిత్రాలూ పోటీ పడుతుండడం విశేషమే.

సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అయిన రోజునే అల వైకుంఠపురములో నుండి మూడో పాట విడుదలైన సంగతి తెల్సిందే. అలాగే సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి పాట మైండ్ బ్లాక్ వచ్చిన రోజే సామజవరగమన సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన కారణంగా ఫ్యాన్స్ కోసమంటూ ఒక వీడియోను విడుదల చేసారు. సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ సూర్యుడివో చంద్రుడివో రిలీజ్ అయిన రోజే, అల వైకుంఠపురములో నుండి ప్రీ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కానుంది. ఇలా రెండు సినిమాలూ ఒక దాంతో ఒకటి పోటీ పడుతూ అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.

చూస్తుంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా కొద్ది రోజుల గ్యాప్ లోనే ఉండే అవకాశముంది. రెండు ఈవెంట్లు కూడా జనవరి మొదటి వారంలోనే జరగనున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తారక్ ను ఆహ్వానించడం, తను వస్తానని చెప్పడం కూడా జరిగిపోయాయన్నది ఆ రూమర్ సారాంశం. ఈ న్యూస్ ఇంకా నిజమో కాదో తెలీదు. అయితే తారక్ తో బన్నీకి మంచి అనుబంధం ఉండడం, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేసి ఉండడం, మరో సినిమా చేయడానికి ఇద్దరూ కమిట్ అయిన నేపథ్యంలో తారక్ రావడం నిజమే అనుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, తారక్ అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళితే, మరో ఆర్ ఆర్ ఆర్ హీరో అయిన చరణ్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లనున్నారట. మహేష్, చరణ్ లకు కూడా మంచి అనుబంధం ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరూ వారి వారి ఫ్యామిలీస్ తో కలిసి హాలిడే ట్రిప్ కూడా వేసి వచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఫ్యామిలీస్ హైదరాబాద్ లో కలుసుకుంటూనే ఉంటాయి. మరోవైపు చరణ్ తో అనిల్ రావిపూడి కూడా టచ్ లోకి ఈ మధ్యనే వచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడు. అందుకే అనిల్ రావిపూడి అయితే బెస్ట్ అని ఈ మధ్యే అతనితో ఒక అరగంట పాటు మీట్ అయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే చరణ్ సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు హాజరుకానున్నాడని తెలుస్తోంది. అయితే ఒక పక్క మెగా హీరో అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ అవుతుంటే, తనకు పోటీగా వస్తోన్న మహేష్ ఈవెంట్ కు చరణ్ వెళతాడా అన్నది సందేహమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38swZW7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...