Skip to main content

యంగ్ హీరో జోక్ నిజ‌మైపోయింది!

karthikeya joke become real
karthikeya joke become real

కొన్ని సార్లు సంద‌ర్భాన్ని బ‌ట్టి చేసే జోక్‌లు అప్పుడ‌ప్పుడు నిజ‌మ‌వుతుంటాయి. ఓయంగ్ హీరో త‌న సినిమా ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన ఓ బిగ్ ప్రొడ్యూస‌ర్‌తో చేసిన జోక్ నెల‌లు తిర‌క్కుండానే నిజమై అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆ జోక్ చేసిన హీరో మ‌రెవ‌రో కాదండోయ్ `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మ‌కొండ‌. వాస్త‌వంగా జ‌రిగిన క‌థ ఆధారంగా రూపొందిన చిత్రం `ఆర్ ఎక్స్ 100`. గ‌త ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగులో సంచ‌ల‌న విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ పాపుల‌ర్ అయ్యారు. అయితే ఈ సినిమా త‌రువాత `హిప్పీ` ప‌రాజ‌యం కావ‌డంతో కార్తికేయ ఈ సారి ఎలాగైనా హిట్‌ని సొంతంచేసుకోవాల‌ని చేసిన చిత్రం `గుణ 369`. బోయ‌పాటి శ్రీ‌ను శిష్యుడు అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా రిలీజ్‌కి ముందు ప్ర‌మోష‌న్‌లో భాగంగా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ వ‌చ్చారు. ట్రైల‌ర్ రిలీజ్‌చేసిన సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్‌లో న‌టించే ఆవ‌కాశం ఇస్తారేమోన‌ని ఎదురుచూస్తున్నాన‌ని హీరో కార్తికేయ వేదిక సాక్షిగా అల్లు అర‌వింద్‌ని అడిగేశారు.

వెంట‌నే చేద్దాంలే అన్నారు. లేదు స‌ర్ జోక్ చేశాన‌ని కార్తికేయ అన‌డంతో వేదిక మీదున్న వాళ్లంతా ఘొల్లున న‌వ్వారు. ఆ రోజు కార్తికేయ గీతా ఆర్ట్స్‌లో అవ‌కాశం ఇవ్వండ‌ని చేసిన జోక్ ఈ రోజు నిజ‌మైంది. గీతా ఆర్ట్స్‌కు అనుబంధ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో కార్తికేయ ఓ సినిమా చేయ‌బోతున్నారు. బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు `చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వ‌చ్చే ఏడాది జ‌నవ‌రి నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YLFh7f

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...