Skip to main content

త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?

త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?
త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా కంటే రచయితగా దక్కే గౌరవం ఎక్కువ. ప్రతి సినిమాలో తనదైన శైలిలో ఫిలాసఫీని చెప్పి, జీవిత సత్యాలను ఈ తరం వారికి పరిచయం చేసి, పౌరాణికాల గురించి కొంచెమైనా ఆసక్తి కలిగేలా చేయడంలో త్రివిక్రమ్ శైలే వేరు. అయితే రచయితగా అందరూ అభిమానించి గౌరవంగా గురూజీ అని పిలిపించుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మాత్రం మొదటినుండి విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తన రెండో సినిమా అతడు, కృష్ణ నటించిన ఒక పాత సినిమా నుండి స్ఫూర్తిగా తీసుకుని అల్లిన కథే అని అర్ధమవుతూనే ఉంటుంది. అత్తారింటికి దారేది కథలో కూడా స్ఫూర్తి తీసుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఇక అ.. ఆ సినిమాను అయితే మీనా అనే నవలను అచ్చుగుద్దినట్లు దింపేసాడు. అజ్ఞాతవాసి సినిమాను లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కించాడు. ఈ విషయంపై ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు న్యాయ పోరాటానికి దిగితే గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక డీలింగ్స్ చేసుకున్నారు.

అరవింద సమేతను పక్కనపెడితే ఇప్పుడు తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రానికి కూడా కాపీ మరకలు అంటుకుంటున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రుల నుండి వేరుపడిన ఇద్దరు పిల్లలు ఒకరి స్థానంలో ఒకరు పెరుగుతుంటారు. ఈ నేపథ్యంలో తన ఇంటికే పనివాడిగా వచ్చిన హీరో.. ఆ ఇంట్లోనే కష్టాలను ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్లాడనేది ఈ సినిమా పాయింట్ గా తెలుస్తోంది. 1958లో ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఇంటిగుట్టు నుండి ఈ పాయింట్ చోరీ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా ఒక మలయాళ సినిమా నుండి కాపీ కొట్టి తీసినదే అన్న విషయం కూడా వార్తల్లో నిలిచింది. ఇలా కథలు చోరీ చేసే బదులు ధైర్యంగా వాటికి క్రెడిట్ ఇచ్చే తీసుకోవచ్చు కదా అని త్రివిక్రమ్ మీద విమర్శలు ఎప్పటినుండో వస్తున్నాయి. అయితే మనోడు మాత్రం తనకు తెలిసిన రూట్ లోనే వెళ్ళిపోతున్నాడు.

ఇంతకీ ప్రచారంలో ఉన్న రూమర్స్ నిజమేనా? నిజంగా అదే అల వైకుంఠపురములో చిత్ర కథా? త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా ఇంటి గుట్టు కథను ఈ తరానికి తగ్గట్లుగా మార్చి తీస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా విడుదలైతే కానీ తెలిసే అవకాశాలు లేవు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి భారీ కాంపిటీషన్ ఉన్న దృష్ట్యా ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ln90xH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...