Skip to main content

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కథ అదేనా.?

RGV’s amma rajyamlo kadapa biddalu story leaked.?
RGV’s amma rajyamlo kadapa biddalu story leaked.?

ఈ ప్రపంచంలో తుఫానులు,భూకంపాల తో మొదలు పెడితే మనుషులకు దెయ్యాలకు చివరికి దేవుడు కి కూడా భయపడకుండా బతికే ఏకైక జీవి R.G.V; బయటకి జనాలందరూ బూతులు తిడుతున్న కానీ, లోపల మాత్రం ఆడు మగాడ్రా బుజ్జీ..! అని ఆనంద పడుతూ ఉంటారు. దానికి కారణం మామూలు మనుషులు చిరాకు లో ఉన్నప్పుడు, ఉన్నప్పుడు లేదా మందు కొట్టినప్పుడు మాట్లాడుకొని ఫీల్ అయ్యే విషయాలను ఆయన నేరుగా ప్రస్తావించి సినిమాలలో కూడా చూపిస్తాడు. తీసే ప్రతి సినిమాలో నిజమైన జీవితానికి సంబంధించిన క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు అక్కడ ఆ నిమిషంలో ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో అలానే చూపిస్తాడు. ఇప్పుడు ఏదో కొత్తగా రామ్ గోపాల్ వర్మ రాజకీయ నాయకుల బయోపిక్ లు అంటూ మొదలు పెట్టలేదు. తన మొట్టమొదటి సినిమా శివ లోనే విలన్ పేరు భవాని అనే పేరుకి ఇన్స్పిరేషన్ గా అప్పట్లో విజయవాడలో సంచలనం సృష్టించిన పెద్ద రాధా గారి పేరును వాడుకున్నాడు. అదే శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ చనిపోయే సీన్ కి ఇన్స్పిరేషన్, ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ గారి తమ్ముడు దేవినేని మురళి హత్య ఉదంతమే. ఎలా అయితే…, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఆయన హత్య జరిగినప్పుడు నిందితులు ఆయన్ని వెంటాడి చంపారో ఆ సన్నివేశం కూడా అలాగే ఉందని అప్పట్లో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అన్నట్లు వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత స్టార్ లన్ని నమ్ముకోకుండా కేవలం సినిమాకి పనిచేసిన టెక్నిషియన్ లకి మాత్రమే గుర్తింపు రావాలి అన్న లక్ష్యంతో క్రైమ్, మాఫియా, హర్రర్, టెర్రరిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలా ప్రతి జోనర్ లోనూ సినిమాలు చేశాడు. జనాలు గుంపులు గుంపులుగా కూర్చుని గుసగుసలు గా మాట్లాడుకునే రాయలసీమ ఫ్యాక్షన్ కథలను రక్తచరిత్ర రూపంలో తీసి చూపించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమాలలో కూడా, యదార్థంగా జరిగిన సంఘటనలను చూపించాడు. తాజాగా ఇప్పుడు “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” గా టైటిల్ మార్చుకున్న సినిమాలో ఆయన చెప్పే కథను ఇదేనని కొంతమంది సినీ లవర్స్ అంటున్నారు.

సినిమా మొదలెడితే, మొత్తం 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన బాబు గారు ఆయన పార్టీ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఓటమి తర్వాత బాబు గారి భజన చేసే రాజకీయ నాయకులు ఒక బ్యాచ్ గా బాబు గారిని భరించలేని నాయకులు ఇంకొక బ్యాచ్ గా విడిపోతారు. ఇలా విడిపోయిన వాళ్ళు అధికార పార్టీలో కి వెళ్దాం అంటే..? అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఆయన పార్టీ లోకి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లక తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో గతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి తన పిల్లనిచ్చిన మామను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడో..? అలానే శాంతిభద్రతల సమస్యలు సృష్టించి రాష్ట్రంలో అల్లకల్లోలం రేపడానికి పూనుకుంటాడు ఓడిపోయిన బాబు గారు.

కేసుల విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నాయకులు ఈ విషయంలో బాబుతో డబల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఒకపక్క బాబుకి తాను ఓటుకు నోటు కేసులో జైల్లో కి వెళ్తాం అన్న భయం కూడా పట్టుకుంటుంది. మరోవైపు “పండిత పుత్ర పరమ శుంఠ” అన్న చందాన ఏ మాత్రం ప్రభావం చూపించలేదని తన కొడుకు పప్పుని చూసుకొని కుమిలిపోతూనే ఉంటాడు. ఇంత సీరియస్ రాజకీయాలలో కూడా, మేం కూడా ఉన్నావంటూ ఒక మత ప్రచారం చేసుకునే వ్యక్తి మరియు రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికలలో బాబు గారికి పరోక్షంగా సహాయపడిన ఒక సినిమా హీరో తమ వంతు కామెడీ చేసి రాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో,

· కష్టపడి పాదయాత్ర చేసి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన ఆ ముఖ్యమంత్రి ఎలా పరిస్థితులను అదుపులోకి తెచ్చాడు.?

· బాబు గారికి రాజకీయ జీవితం చివరి రోజుల్లో అయినా గాని జ్ఞానోదయం అయ్యిందా.?

· ఆయన వంశోద్ధారకుడు తో పాటుగా మిగిలిన రెండు కామెడీ పీస్ లు అయినటువంటి రాజకీయ నాయకులు ఏం చేశారు.?

· తమ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతం గా ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్న ఆ కేంద్ర ప్రభుత్వ పార్టీ ఏం చేసింది.?

ఇదే మిగిలిన సినిమా కథ.

ఇక సినిమాలో చెప్పుకున్నట్లుగా ఆ బాబుగారి నిజజీవిత రాజకీయ శత్రువుల అందరూ పరోక్షంగా ఈ సినిమా ని సపోర్ట్ చేసి విడుదల అవ్వడానికి సహకరించినట్లు తెలుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sbb05q

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...