Skip to main content

టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!

టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!
టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. యూనివ‌ర్శ‌ల్ మీడియా బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భార‌తీయ చిత్రాల్లోనే హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ చిత్రం హాలీవుడ్ మూవీ `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` స్ఫూర్తితో రూపొందుతోంది. రామ్‌చ‌ర‌ణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తుండ‌గా, నిజాంపై తిరుగుబాటు బావుటాను ఎగ‌రేసిన విప్ల‌వ వీరుడు కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ అత్యంత ర‌హ‌స్యంగా జ‌రుగుతోంది. సినిమా ప్రారంభంలో చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టిల్స్ బ‌య‌టికి రావ‌డంతో ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సెట్‌లో ప్ర‌తీ ఒక్క‌రి విష‌యంలోనూ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ వైజాగ్ సిటీ స‌మీపంలోని మారుమూల గ్రామాల్లో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా చిత్రీక‌రిస్తున్న ఈ ప‌తాక ఘ‌ట్టాల కోసం సెట్‌లో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

వైజాగ్‌కు స‌మీపంలోని రిమోట్ ఏరియాలో మొద‌లైన ఈ షెడ్యూల్ మ‌రో 6 రోజుల పాటు అక్క‌డే జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నార‌ని, త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. 1920 కాలం నాటి స్వాతంత్ర పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగ‌బోతోంది. వ‌చ్చే ఏడాది జూలై 30న ఎట్టిప‌రిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ‌ల‌తో పాటు హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్‌స‌న్‌, ఒలివియా మోరిస్‌, అలీస‌న్ డూడీ న‌టిస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P58PJy

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...