Skip to main content

కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్

కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్
కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్

తకిట తకిట త టు… ఫోర్
తకధిమి తకధిమి సిక్స్… ఎయిట్
ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందో ఏమో అని భయమేస్తుంది. అభిమానులం అందరం కలిసి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటామా.? కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నిన్న సాయంత్రం సరిగ్గా ఐదు గంటల నాలుగు నిమిషాలకు మా మహేష్ బాబు నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు లో “మైండ్ బ్లాకు” అనే పాట విడుదలైంది. పాట విన్నాక అర్ధం అయ్యింది ఏంటంటే, అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన పోకిరి సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ “మైండ్ బ్లాక్” ని మళ్లీ మహేష్ బాబు సినిమాలో వాడుకున్నారు.

అంత పెద్ద హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని మర్చిపోతారు గానీ, మావోడు రాసిన డైలాగ్ ని ఆల్రెడీ ఒకసారి శ్రీమంతుడు సినిమాలో “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది…” అని వాడుకుని; మళ్లీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ అనే పాట కోసం వాడుకున్నారు. సరే వాడుకున్నది ఎవడో బయట వ్యక్తి కాదు లే మనోడే దేవి శ్రీ ప్రసాద్ కదా.. అని మెదలకుండా ఊరుకుంటే మొత్తం సాంగ్ అంతా… కాపీ కొట్టాడు భయ్యా..

అసలు పాట వింటుంటే ఒకటి కాదు మొత్తం మూడు ట్యూన్ లు గుర్తొస్తున్నాయి. మాములుగా కడుపుకి మందు తాగే వాడు ఎవడైనా ఒక పాటకి ఒక ట్యూన్ నే కాపీ కొడతాడు కానీ, మన దేవిశ్రీప్రసాద్ చాలా గొప్పవారు కదా అందుకని ఒక పాట కోసం ఏకంగా మూడు ట్యూన్ లను కాపీ కొట్టాడు. ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “నేను శైలజ..” సినిమా లో శైలజా… శైలజా… శైలజా అనే పాట ట్యూన్ ని మైండ్ బ్లాక్… మైండ్ బ్లాక్ కోసం వాడుకోగా, బేస్ రిథం ను జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించిన “ఆడోరకం ఈడోరకం” సినిమాలో ఉన్న “రెండు కోళ్ళు ఉన్నాయి – రెండు పెట్టలు ఉన్నాయి” అనే పాట ట్యూన్ నుంచి కాపీ కొట్టాడు. ఇక మధ్యమధ్యలో హీరోయిన కసిగా బాబు.. బాబు అనే డైలాగ్స్ ని హిందీ లో బాగా పాపులర్ అయిన సోను… అనే ట్యూన్ నుంచి కాపీ కొట్టాడు. ఫైనల్ గా పాట ఎలా ఉంది..? అని అడిగితే as it is ఉంది సార్ అని చెబుతున్నారు అభిమానులు.

ఎవరు ఎలా పోయినా, మధ్యలో మా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం అన్యాయం అయిపోయాడు. మా అనిల్ అన్న ఇలా కాపీ ట్యూన్ లతో ఇబ్బంది పడటం ఇది మొదటిసారి కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో మొదట వచ్చిన సినిమా “పటాస్” లో కూడా కాపీ ట్యూన్ సంఘం ప్రెసిడెంట్ అయిన మన సాయి కార్తీక్ రెండు మూడు పాటలకు కాపీ కొట్టిన ట్యూన్ లు ఇవ్వడమే కాకుండా, ఇంటర్వ్యూలలో సిగ్గు లేకుండా కాపీ ట్యూన్ లు ఇచ్చానని ఒప్పుకున్నాడు.

అసలు నాకు తెలియక అడుగుతాను భయ్యా..? ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా..! కాపీ ట్యూన్ లు ఇవ్వమని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలే అడుగుతారా..? ఏదిఏమైనా, తెలుగు సినిమా మ్యూజిక్ అంటేనే ఎటకారం అయిపోయింది జనాలకి. కొత్తగా రిలీజ్ అయిన సినిమా లోనుంచి ఒక్కొక్క పాట వదులుతూ ఉంటే ఇది ఇంతక్రితం ఈ పాటని ఎందులో వాడారు.? అని చెప్పి రీసెర్చ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. కాబట్టి మనోడే అని నమ్మి సినిమా ఇచ్చినందుకు మరొకసారి మహేష్ బాబును దేవిశ్రీప్రసాద్ పూర్తిగా డిజప్పాయింట్ చేసాడు అని అనుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DBDwjc

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...