Skip to main content

కోచ్ ను అంటున్నారని ఫైరైపోతోన్న కెప్టెన్ కోహ్లీ

Virat Kohli criticizes who commented Ravi Shastri
Virat Kohli criticizes who commented Ravi Shastri

కెప్టెన్ గా విరాట్ కోహ్లీ స్థాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్లేయర్ గా జట్టుకి ఎన్నో మరపురాని విజయాలను అందించిన కోహ్లీ, కెప్టెన్ అయ్యాక కూడా ఎక్కడా తగ్గట్లేదు. జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ సరదాగా కనిపించే కోహ్లీకి ఇప్పుడు ఫుల్లుగా కోపం వచ్చేసింది. స్టేడియంలో అభిమానులను అలరిస్తూ ఇంకా గోల చేయమని ప్రోత్సహిస్తూ ఉంటాడు కోహ్లీ. ఇక ప్రెస్ మీట్స్ లో మీడియాతో ఎంత సరదాగా ఉంటాడో, ఎలా పంచ్ లు వేస్తాడో అందరికీ తెల్సిందే. అలాంటి కోహ్లీకి కోపం ఎందుకొచ్చిందీ అంటే తన కోచ్ ను అందరూ తిడుతుంటే తాను కూల్ గా ఎలా ఉంటాను అంటున్నాడు.

ఇంతకీ అసలు విషయంలోకి వెళితే.. టీమిండియా మెన్స్ కోచ్ రవిశాస్త్రి మీద సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్స్ పడతాయో అందరికీ తెల్సిందే. టీమిండియా కోచ్ గా రవిశాస్త్రిని కనీసం కన్సిడర్ చేయకుండా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏ ప్లేయర్ మీదా రానన్ని మీమ్స్ రవిశాస్త్రిపై వస్తూ ఉంటాయి. తనని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తుంటారు మీడియాలో. టీం ఫొటోస్ లో కూడా రవిశాస్త్రి కూర్చున్న కుర్చీ కింద మందు బాటిల్ పెట్టి మరీ మీమ్స్ వేస్తుంటారు. రవిశాస్త్రి పెర్సొనాలిటీని కూడా వదలరు. తన పొట్టను కూడా కామెంట్ చేస్తుంటారు.

ఈ విషయమై విరాట్ కోహ్లీ స్పందించాడు. రవిశాస్త్రితో కలిపి తనను కూడా ట్రోల్ చేస్తుండడంతో కోహ్లీ గుస్సా అయ్యాడు. రవిశాస్త్రిని విమర్శించే ముందు జీవితంలో తాము ఏం సాధించాలో చూసుకోవాలని, రవిశాస్త్రి మొదట 10వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడని, అక్కడినుండి మొదలై ఓపెనర్ కూడా అయ్యాడని, టీమిండియాకు ఎన్నో మరపురాని  విజయాలు అందించాడని, అతణ్ణి కామెంట్ చేసేముందు ఆయన సాధించింది వాళ్ళు సాధించి చూపించాలని, కనీసం అంత ధైర్యమైనా ఉండాలని కోహ్లీ అంటున్నాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళే ఇలా కామెంట్ చేస్తుంటారని అంటున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37XaR63

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...