Skip to main content

ఇక్కడే లేదంటే విజయ్ కు అక్కడ కూడా కావాలట

Vijay Deverakondas next will be pan indian
Vijay Deverakondas next will be pan indian

ప్యాన్ ఇండియా రిలీజ్.. ఇదివరకు ఈ మాట ఒక బ్రహ్మ ప్రధార్థంలా ఉండేది. కానీ రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్యాన్ ఇండియా అంటే భయపడే రీజినల్ సినిమాలు ఇప్పుడు ప్యాన్ ఇండియాను టార్గెట్ చేస్తుండడం విశేషం. అయితే ఇందులో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వరకే చూసుకుంటే బాహుబలి 1 అండ్ 2, ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజై సక్సెస్ సాధించాయి. బాహుబలి తర్వాత ఎన్ని సినిమాలు ప్యాన్ ఇండియా కోసం ట్రై చేసినా అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. బాహుబలి తర్వాత తెలుగులో సాహో, సైరా అంటూ ప్యాన్ ఇండియా అని టార్గెట్ చేసారు కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు.

సాహో బాలీవుడ్ లో బాగా ఆడితే తెలుగు రాష్ట్రాలతో సహా మిగతా అన్ని చోట్లా దారుణమైన ప్లాప్ గా మిగిలింది. ఇక సైరా తెలుగులో బానే ఆడింది కానీ మిగతా అన్ని చోట్లా ప్లాప్ అయింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా అంటే మరోసారి ఆలోచనలో పడ్డాయి. వీటికి రిస్క్ కూడా ఎక్కువ ఉండడంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మాత్రం ప్యాన్ ఇండియా కలలే కంటున్నాడు.

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని దక్షిణాది భాషలన్నిటిలో వేర్వేరుగా ఒకేరోజున విడుదలైతే చేసారు కానీ అది తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా దారుణమైన ప్లాప్ గా మిగిలింది. ఇక నోటా కూడా తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేస్తే రెండు చోట్లా కూడా ప్లాప్ అయింది. ఈ రెండు ప్లాపులతో విజయ్ కెరీర్ తెలుగులోనే బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడే మార్కెట్ కోల్పోయాడు. ఇప్పుడు కచ్చితంగా ఇక్కడ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత పూరి జగన్నాథ్ తో చేయబోతున్న ఫైటర్ చిత్రాన్ని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. తెలుగులో మార్కెట్ ను తిరిగి చేజిక్కుంచుకోవడానికి తంటాలు పడుతున్న తరుణంలో ఇప్పుడు ప్యాన్ ఇండియా వేషాలు అవసరమా అని బహిరంగంగానే కామెంట్స్ వేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఈ మాటలు వింటున్నాడా?.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RhH1mL

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...