Skip to main content

త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?

త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?
త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?

రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతణ్ణి మాటల మాంత్రికుడు అని పిలుస్తారంటేనే ప్రేక్షకుల్లో అతనికున్న ఫాలోయింగ్ గురించి అర్ధం చేసుకోవచ్చు. దర్శకుడు కాకముందు రచయితగా టాప్ స్థానాన్ని అనుభవించాడు త్రివిక్రమ్. తాను రచించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్. రచయితల్లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్నవాడిగా కూడా త్రివిక్రమ్ కు పేరుంది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక కూడా అతనిలోని రచయితే ఎక్కువ డామినేట్ చేస్తూ వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా సాధించిన విజయాల్లో కూడా సింహభాగం క్రెడిట్ అతనిలోని రచయితకే దక్కుతుంది. అయితే రాను రాను త్రివిక్రమ్ తన సినిమాల విషయంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొన్ని సన్నివేశాల్ని రొటీన్ గా తీస్తాడన్న పేరు కూడా వచ్చింది.

లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలని గమనిస్తే ఒక కామన్ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఎక్ఖవగా ఆఫీస్ సెటప్ ఉన్న సీన్లను తీస్తున్నాడు త్రివిక్రమ్. ఒక సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో ఆఫీస్ సెటప్ ఉంటే, మరొక సినిమాలో ఒక్క సన్నివేశమైనా ఉంటుంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి ఇలా సినిమాల్లో ఆఫీస్ సన్నివేశాలు మాత్రం కచ్చితం. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో ఆఫీస్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్న విషయం ఇప్పటిదాకా మనకు విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ తో అర్ధమైపోతోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో ఒక ఆఫీస్ కు బాస్ గా కనిపిస్తే ఆమె కింద ఎంప్లొయ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అసలు అల్లు అర్జున్ ఆమె ఆఫీస్ లోకి ఎలా వచ్చాడన్నది కీలకంగా తెలుస్తోంది. ఇక ఇదే ఆఫీస్ సెటప్ లో నవదీప్, రాహుల్ రామకృష్ణ కూడా కనిపించనున్నారు. ఈరోజు విడుదల కాబోయే టీజర్ లో కూడా ఆఫీస్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ టీజర్ లో కూడా అల్లు అర్జున్ టేబుల్ పై నడిచిన సన్నివేశాన్ని పెట్టారు.

మరి త్రివిక్రమ్ ఇదేమైనా సెంటిమెంట్ గా కొనసాగిస్తున్నాడా లేక నిజంగానే త్రివిక్రమ్ ఐడియాస్ రొటీన్ అయిపోతున్నాయా అన్నది తెలీదు కానీ ఒకలాంటి సన్నివేశాలే రిపీట్ అవుతున్నాయనేది మాత్రం స్పష్టం. ఇక అల వైకుంఠపురములో విషయానికి వస్తే ఈ చిత్రంలో టబు ముఖ్యపాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. మలయాళ నటుడు జయరాం, సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న విషయం తెల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38oBNfc

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...