Skip to main content

అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్

అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్
అంతకంతకూ పెరిగిపోతోన్న సత్యరాజ్ రేంజ్

సినిమా ఇండస్ట్రీలో ఎవరి రేంజ్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ ఎప్పటినుండో సినిమాల్లో ఉన్నా కానీ 50వ వడిలో పడితే కానీ బ్రేక్ రాలేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పరిస్థితి కూడా అంతే. ఇక హీరోలుగా ఉన్నప్పుడు బ్రేక్ రాని వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక ఒక వెలుగు వెలిగిన సందర్భాలు మనం చాలా చూసాం. అలాగే హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలిన వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దొరక్కపోవడమూ చూసాం. జగపతి బాబునే తీసుకుంటే.. హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జగపతి బాబు, క్రమంగా మార్కెట్ కోల్పోతూ వచ్చాడు. అయితే సరైన సమయంలో తన పరిస్థితి తెలుసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. లెజండ్ లో విలన్ గా చేయడంతో తన కెరీర్ స్వరూపమే మారిపోయింది. హీరోగా అందుకోనంత పారితోషకాల్ని కూడా తక్కువ డేట్స్ మాత్రమే ఇచ్చి క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా అందుకుంటున్నాడు జగ్గూ భాయ్.

ప్రస్తుతం జగపతి బాబు లానే తెలుగులో, ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సత్యరాజ్ అనే చెప్పాలి. మిర్చి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్ రేంజ్ బాహుబలి సిరీస్ తో అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో కట్టప్ప పాత్రతో అందరి మనస్సుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నాడు సత్యరాజ్. హీరోగా తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన సత్యరాజ్ కు ఇప్పుడున్నంత డిమాండ్ అప్పుడు లేదు. ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో సగం కూడా అప్పుడు హీరోగా ఆయన అందుకోలేదంటే ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో చుడండి.

ఇప్పుడు సత్యరాజ్ ను సినిమాల్లో పెట్టుకోవాలంటే 2 నుండి రెండున్నర కోట్ల మధ్య పారితోషికం సమర్పించుకోవాల్సిందే. అదనంగా డబ్బింగ్ కు మరో 10 నుండి 15 లక్షలు అవుతాయి. అంత పెట్టి సత్యరాజ్ ను పెట్టుకున్నప్పుడు బలమైన పాత్రలే అతనికి ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానుండడం నిజంగా విశేషమే.

సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ కు తాతగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇందులో హీరో పాత్ర తర్వాత హైలైట్ అయ్యేది సత్యరాజ్ పాత్రే కావడం విశేషం. అలాగే కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో కనిపించనున్న దొంగ చిత్రంలో కూడా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. పోస్టర్లలో కూడా వీరి ముగ్గురిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 20నే విడుదలయ్యే అవకాశాలున్నాయి. సత్యరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని నటన, మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RQ7FUa

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...