Skip to main content

వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం

వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం
వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న వెంకీ మామ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎంతలా కన్ఫ్యూజన్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా దసరా అనుకున్నారు. వెంకీకు గాయమవడంతో ఆ డేట్ కుదర్లేదు. తర్వాత దీపావళి అనుకున్నారు, కానీ సమయానికి బాబీ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ అవుతుంది అని సంకేతాలిచ్చారు కానీ అది కూడా అవ్వలేదు. అప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవడంతో వెంకీ మామకు స్కోప్ లేకుండా పోయింది. అందుకే క్రిస్మస్ కు దిగారు. ఇక్కడ కూడా వెంటనే ఏ విషయం తేల్చలేదు. కొద్ది రోజులు డిసెంబర్ 25 అన్నారు, కొద్ది రోజులు డిసెంబర్ 13 అన్నారు. అటూ ఇటూ ఊగిసలాడి చివరికి డిసెంబర్ 25న ఓకే అని అందరూ అనుకుంటున్న సమయంలో లేదు డిసెంబర్ 13 అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే సురేష్ బాబు డిసెంబర్ 13న సినిమా విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనకాల దిల్ రాజు మంత్రాంగం ఉందని తెలుస్తోంది.

వెంకీ మామను మొదట వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13నే విడుదల చేద్దామనుకున్నారు సురేష్ బాబు. అయితే డిస్ట్రిబ్యూటర్లు అందుకు సమ్మతించలేదు. వారంలో క్రిస్మస్ రిలీజ్ పెట్టుకుని నాన్ హాలిడే సీజన్ లో రిలీజ్ చేయడం ఎందుకు అన్న భావన వ్యక్తపరిచారు. పైగా డిసెంబర్ 13 అంటే ఇంకా సీజన్ డల్ గానే ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బంది ఉంటుందని భారీ రేట్లకు సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భావించారు. దీంతో సురేష్ బాబు కూడా ఇక డిసెంబర్ 25కె ఫిక్స్ అయిపోదామనుకున్నాడు.

సరిగ్గా అప్పుడే దిల్ రాజు రంగంలోకి దిగాడు. దిల్ రాజు, సురేష్ బాబులకు మంచి అనుబంధం ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరూ రిలీజ్ డేట్ ల విషయంలో ఇప్పటికే ఒకరి కోసం ఒకరు కంప్రమైజ్ అయ్యారు.. ఈ చనువుతోనే దిల్ రాజు, సురేష్ బాబును రిక్వెస్ట్ చేసాడట. డిసెంబర్ 25న తమ సినిమా ఇద్దరి లోకం ఒకటే సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నట్లు తెలిపాడు దిల్ రాజు. ఈ సీజన్ మిస్ అయితే తమ సినిమాకు చాలా ఇబ్బంది అవుతుందని, డిసెంబర్ 13న ఏమాత్రం క్రేజ్ లేని ఇద్దరి లోకం ఒకటేను రిలీజ్ చేయలేమని, ఇక క్రిస్మస్ కూడా మిస్ అయితే మళ్ళీ ఏ ఫిబ్రవరికో విడుదలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే ఒక సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తెలిపాడు దిల్ రాజు.

వెంకీ మామకు ఎలాగు బజ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 13న రిలీజ్ చేస్తే అదే రోజు నుండి మార్కెట్ ఊపందుకుంటుందని, అది తర్వాత సినిమాలకు కూడా ఉపయోగపడుతుందని దిల్ రాజు, సురేష్ బాబును ఒప్పించాడట. అందుకే సురేష్ బాబు మొదట డిసెంబర్ 25 న విడుదల చేద్దామని అనుకున్నా చివరికి డిసెంబర్ 13న ఫిక్స్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33KOSvN

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...