Skip to main content

దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!

దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!
దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!

టాలీవుడ్‌లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌ల‌లో తెలంగాణ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పంథానే వేరు. డిస్డ్రిబ్యూట‌ర్‌గా , ఎగ్జిబిట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు `భార‌త్ బంద్‌`, పెళ్లిం చెబితే వినాలి` చిత్రాల న‌టుడు కాస్ట్యూమ్స్ కృష్ణ స‌హకారంతో డిస్ట్రిబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయ్యారు. `దిల్‌` చిత్రంతో నిర్మాత‌గా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన ఆయ‌న త‌న అభిరుచికి త‌గ్గ సినిమాలు నిర్మిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.

2003లో నిర్మాత‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఈ ప‌ద‌హారేళ్ల జ‌ర్నీలో అత్య‌ధిక విజ‌యాల్ని సొంతం చేసుకున్న నిర్మాత‌గా ఇండస్ట్రీలో టాప్ పొజిష‌న్ కు చేరుకున్నారు. డ‌బ్బింగ్ చిత్రాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 48 చిత్రాల్ని అందించారాయ‌న‌. ఇందులో కొన్ని ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించిన చిత్రాలు కూడా వున్నాయి. టేస్ట్ వున్న నిర్మాత‌గా ప‌లువురికి రోల్ మోడ‌ల్‌గా నిలిచిన దిల్‌రాజు తాజాగా త‌న పంథాను మార్చారు. తెలుగులో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో నిర్మించిన `ఎఫ్‌2` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించ‌బోతున్నారు. దీంతో ఆయ‌న బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

అనీస్ బాజ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాతో బాలీవుడ్ బాట‌ప‌డుతున్న దిల్ రాజు ఇందు కోసం ఓ టెర్రిఫిక్ గేమ్ ప్లాన్‌ని రెడీ చేసుకున్నాడు. బోనీ క‌పూర్‌తో క‌లిసి `ఎఫ్‌2`ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్న దిల్ రాజు దీనితో పాటు `జెర్సీ` బాలీవుడ్ రీమేక్‌కు కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక హిందీ, త‌మిళ భాష‌ల్లో ఇప్ప‌టికే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `పింక్‌` తెలుగు రీమేక్‌లోనూ దిల్‌రాజు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తూ మిగ‌తా నిర్మాత‌ల‌కి త‌న గేమ్ ప్లాన్‌తో దిమ్మ‌దిరిగే ట్విస్ట్ ఇస్తున్నాడు. ఎఫ్‌2, జెర్సీ చిత్రాలు దిల్ రాజుకు బాలీవుడ్‌లో మంచి పేరుని తెచ్చిపెట్ట‌డం ఖాయ‌మ‌ని ఈ విష‌యంలో ఆయ‌న గేమ్ ప్లాన్ అదిరింద‌ని ఫిలిం స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36w4THF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...