Skip to main content

బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!

బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!
బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ త‌రువాత భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న‌ సంచ‌ల‌న నిర్ణ‌యం బాలాకోట్ దాడులు. పాకిస్టాన్‌ని స్థావ‌రంగా చేసుకేని బాల‌కోట్ కేంద్రంగా జైషే మ‌హ‌మ్మ‌ద్ మూక‌లు టెర్ర‌రిజాన్నివిస్త‌రిస్తూ గ‌త కొంత కాలంగా యావ‌త్ ప్ర‌పంచాన్నివ‌రుస దాడుల‌తో వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ దాడికి ప్ర‌తీకారంగా ఉగ్ర‌ర మూక‌లు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్‌పై ఆత్మాహుతి దాడికి దిగ‌డంతో దాదాపు 60 మంచి సైనికులు అమ‌రుల‌య్యారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగ‌డంతో బీజేపీ ప్ర‌భుత్వం దీన్నోస‌వాల్‌గా స్వీక‌రించింది.

పాకిస్థాన్ స్థావ‌రంగా బాల‌కోట్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్న జైషే మ‌హ‌మ్మ‌ద్ స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఏయిర్ఫోర్స్‌ని రంగంలోకి దింపి వ‌రుస దాడులను చేయించింది. ఈ దాడి అనంత‌రం భార‌త్ గ‌గ‌న త‌లంపై అనుమానాస్ప‌దంగా సంచ‌రించిన పాకిస్థాన్ ఆర్మీ యుద్ధ విమానాన్ని మిగ్ 21 ఫైట‌ర్ జెట్‌తో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ త‌రిమికొట్టి సాంకేతిక లోపం కార‌ణంగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో పాక్ సైన్యానికి బందీగా ప‌ట్టుబ‌డ్డారు. అనేక దౌత్య ప్ర‌య‌త్నాలు, అమెరికా ఆంక్ష‌ల కార‌ణంగా చిత్ర‌హింస‌ల అనంత‌రం రెండు రోజుల త‌రువాత వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ని పాక్ భార‌త సైన్యానికి అప్ప‌గించింది. దీంతో

రెండు రోజుల పాటు చిత్ర హింస‌ల‌కు గురిచేసినా ఎలాంటి భ‌యం బెరుకు లుకుండా నిల‌బ‌డిన అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ హీరో అయ్యాడు. బాల‌కోట్ ఉదంతం నేప‌థ్యంలో త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతోంది. దేశం కోసం ప్రాణాల‌ని సైతం లెక్క‌చేయ‌ని రియ‌ల్ హీరో క‌థ‌గా బాలీవుడ్ తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూష‌ణ్‌కుమార్‌, మ‌హావీర్ జైన్‌, ప్ర‌గ్యా క‌పూర్‌తో క‌లిసి భారీ చిత్రాల నిర్మాత‌, ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని భూష‌న్ కుమార్ శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అభిషేక్ క‌పూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2slBhhu

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...