Skip to main content

త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??

త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??
త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఉన్నప్పటి నుండి తన ప్రధాన ఎమోషన్ ఎప్పుడూ కామెడీ మీదే ఉండేది. తనదైన శైలి ప్రాసలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కడుపుబ్బా నవ్వించేవాడు. దర్శకుడిగా మారాక కూడా త్రివిక్రమ్ దృష్టి ఎక్కువగా కామెడీ మీదే ఉంది. మొదటి సినిమా నువ్వే నువ్వే నుండి ప్రస్తుతం చేస్తోన్న అల వైకుంఠపురములో వరకూ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎక్కువగా లైట్ హార్టెడ్ కామెడీ బేస్డ్ గానే ఉంటూ వస్తున్నాయి. జోనర్ ఏదైనా త్రివిక్రమ్ సినిమాలు ప్రధానంగా కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గానే నడుస్తుంటాయి. మరోవైపు విక్టరీ వెంకటేష్ అనగానే మొదట గుర్తొచ్చేది కామెడీనే. తనపైనే పంచ్ లు వేయించుకుంటూ 90ల కాలంలో వెంకీ కామెడీను తలుచుకుని ప్రేక్షకులు ఇప్పటికీ నవ్వుకుంటారు.

అందుకే వీరిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు మరింత ఎగ్జైట్ అయ్యారు. వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాల పేర్లు చెప్పగానే ఇప్పటికీ ప్రేక్షకులకు దర్శకుడి కంటే కూడా ముందు త్రివిక్రమ్ పేరే గుర్తొస్తుంది. అంతలా ఆ సినిమాలపై త్రివిక్రమ్ ముద్ర వేసాడు. ఇక అప్పట్లో వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా అవకాశం ఇద్దామని ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అది కుదర్లేదు. తర్వాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు.

అయితే మళ్ళీ రెండేళ్ల నుండీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి వార్తలు రావడం మొదలయ్యాయి. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ మంచి కథతో వస్తే తప్పకుండా త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని చెప్పాడు. త్రివిక్రమ్ కూడా త్వరలో సినిమా ఉండొచ్చంటూ సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలో ఎఫ్ 2 తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంకటేష్ వెంకీ మామ సినిమాను మొదలుపెట్టాడు. అలాగే త్రివిక్రమ్ బన్నీతో అల వైకుంఠపురములో చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలకు దగ్గర్లో ఉన్నాయి. వెంకీ మామ డిసెంబర్ 13న విడుదలవుతుంటే, అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కానుంది. పోనీ ఈ సినిమా తర్వాతైనా ఈ సినిమా ఉంటుందా అంటే అది జరిగేలా కనిపించట్లేదు.

ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒక యంగ్ హీరోతో సినిమా చేయనున్నాడు. తర్వాత అతనికి చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. వెంకీ కూడా ఇప్పుడు అసురన్ రీమేక్ లో నటించడానికి సమాయత్తమవుతున్నాడు. దీని తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయాలి. మరో యువ దర్శకుడు కూడా వెంకీకు లైన్ వినిపించాడు. అది ఓకే అయితే ఆ సినిమా కూడా క్యూ లో ఉంటుంది. తనతో గురు సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమా ఉండే అవకాశముంది. ఇంకా పలు కథలను వింటున్నాడు. ఇలా ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోతున్న తరుణంలో ఈ కాంబోలో సినిమా ఇప్పట్లో లేనట్లే అనుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RR4DPJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...