Skip to main content

ఫొటోస్టోరీ: పాయ‌ల్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

Payal Rajput
Payal Rajput

చిన్న చిత్రాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `ఆర్ ఎక్స్ 100`. ఈ సినిమాతో నెగెటివ్ షేడ్స్ వున్న క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది పంజాబీ సోయ‌గం పాయ‌ల్ రాజ్‌పుత్‌. చ‌న్నా మేరెయా, వేరేకీ వెడ్డింగ్ చిత్రాల‌తో్ పంజాబీ ఇండ‌స్ట్రీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా పాయ‌ల్‌కు ఆశించిన గుర్తింపు లభించ‌లేదు. దీంతో టాలీవుడ్ బ‌మాట‌ప‌ట్టిన ఆమెకు  `ఆర్ ఎక్స్ 100` తెలుగులో తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అయితే హాట్ హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న పాయ‌ల్ అందుకు భిన్న‌మైన ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

`ఆర్ డీఎక్స్‌` సినిమాలో రెచ్చిపోయి న‌టించి మ‌ళ్లీ అదే బాట‌ప‌ట్టిన ఆమెకు వ‌రుస‌గా అదే త‌ర‌హా ఆఫ‌ర్‌లు వ‌స్తున్నాయ‌ట‌. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీమామ‌`, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో క‌లిసి `డిస్కోరాజా` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో విక్ట‌రి వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన `వెంకీ మామ‌` ఈ నెల 13న విడుద‌ల‌వుతోంది. ర‌వితేజ‌తో న‌టిస్తున్న `డిస్కోరాజా` జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ రెండు చిత్రాల ద్వారా త‌న పంథాను మార్చుకోవాల‌ని, త‌న‌పై ప‌డిన హాట్ భామ మార్కుని చెరిపేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఏదీ క‌లిసి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

`ఆర్ ఎక్స్ 100` సినిమాలో పోషించిన పాత్ర ఇంపాక్ట్ ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా పాయ‌ల్‌కు అదే త‌ర‌హా పాత్ర‌ల్ని ఆఫ‌ర్ చేస్తుండ‌టంతో చేసేది లేక పాయ‌ల్ మ‌ళ్లీ అదే బాట‌ప‌డుతోంది. ఇందులో భాగంగానే సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెటట్టింది. తాజాగా పాయ‌ల్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పాయ‌ల్ త‌న అందాలొలికిస్తూ ఫొటోల‌కు పోజిచ్చిన ఫొటో చూసిన అభిమానులంతా పాయ‌ల్ సొగ‌సుచూడ త‌ర‌మా అని మురిసిపోతున్నారు.

 

View this post on Instagram

 

The perfect ones are always flawed 🥀 . Lensed by @i_ak_photographer 📸

A post shared by Payal Rajput (@rajputpaayal) on



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36fwe0F

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...