66వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు నుంచి ఉత్తమ నటి పురస్కరాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేస్ భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. `మహానటి` చిత్రానికి గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఉత్తమ నటులుగా `అందాధూన్` చిత్రానికి గాను ఆయుష్మాన్ ఖురానా,`యురి` చిత్రానికి గానూ విక్కీ కౌషల్ ఈ పురస్కరాల్ని సొంతం చేసుకున్నారు.
`ప్యాడ్ మ్యాన్` చిత్రానికి గానూ ఖిలాడీ హీరో అక్షయ్కుమార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమ నుంచి పురస్కారాలు దక్కించుకున్న కీర్తిసురేష్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌషల్, అక్షయ్కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పురస్కారాల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ హారు కాలేకపోయారు. వైరల్ ఫీవర్ కారణంగా బిగ్బి అమితాబ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది.
జాతీయ చలన చిత్ర పురస్కరాలు అందుకున్న వారికి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఈ నెల 29న తేనీటి విందుని ఇవ్వనున్నారు. అదే రోజు బిగ్ బి అమితాబ్ బచ్చన్కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేయనున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tKRTA0
Comments
Post a Comment