Skip to main content

టార్గెట్ బాహుబలి – మణిరత్నం పోన్నియన్ సెల్వన్

Mani Ratnam targets bahubali with his movie Ponniyin Selvan
Mani Ratnam targets bahubali with his movie Ponniyin Selvan

పాన్ ఇండియా సబ్జెక్ట్ తో ఎన్ని సినిమాలు వస్తున్నా, సినీ మీడియా ప్రతి సినిమాను బహుబలితో పోల్చి కథనాలు ప్రసారం చేస్తున్నారు. సినిమా కథా, కథనాల పరంగా ఎలా ఉన్నా, కలెక్షన్స్ పరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు ఇందుకు కారణం కావచ్చు. అసలు రాజమౌళి కంటే ముందు ఇండస్టీ కి పాన్ ఇండియా సినిమాలు అలవాటు చేసిన దర్శకులలో ఒకరు మణిరత్నం. కథ, స్క్రీన్ ప్లే ,టెక్నాలజీ, టేకింగ్ మరీ ముఖ్యంగా ఫ్రేం సెన్స్ ఇలా మణిరత్నం గారి ప్రతి సినిమా ఎంతో డీటేయిలింగ్ తో కూడి ఉంటుంది. అందరికంటే ముందు ఇండస్ట్రీ లో హేమాహేమీలు వంటి నటులతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి హిట్ కొట్టిన వ్యక్తి మణి సార్.

తన ప్రతీ సినిమాకు మూల కథను రామాయణం, మహాభారతం నుండే తీసుకునే మణి గారు ప్రస్తుతం కల్కి కృష్ణమూర్తి గారు రాసిన 2400 పేజీల “పోన్నియన్ సెల్వన్” అనే మహా గ్రంధం ఆధారంగా భారీ సినిమాను చేస్తున్నారు. గతంలో ఏంజీఆర్ వంటి మహానటులు సైతం ఆ ప్రాజెక్టు చెయ్యాలని అనుకున్నారు. పోన్నియ్యన్ సెల్వన్ అంటే కావేరి పుత్రుడు అని అర్ధం. ఈ కథ 10 – 11 శతబ్దాలలో భారత ఖండాంతరాలు దాటి సామ్రాజ్యం విస్తరించిన, చోళ రాజు ఆరుల్మోజి వర్మన్ కి చెందినది.

ఇతను రాజుగా పట్టాభిషేకం తరువాత, రాజ రాజ చోళునిగా ప్రసిద్ధి చెందాడు. ఇతని పాలనా మరియు అతని తరువాత వచ్చిన రాజుల హయాంలో చోళ సామ్రాజ్యం ఉచ్ఛ దశకు చేరుకుంది. ఇప్పుడు అపూర్వ గాధను మణిరత్నం వెండితెరపై మనకు చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. విక్రం, కార్తి, ఐశ్వర్య రాయ్, విక్రం ఇంకా ఎంతో మంది పెద్ద నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

తీసే ప్రతి సినిమాను ఒక దృశ్య కావ్యంగా తీర్చిదిద్దే మణిరత్నం ఈ సినిమాను ఒక ఎపిక్ స్థాయిలో తీర్చిదిద్దుతాడనడం లో ఏం సందేహం లేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35nNKzR

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...