Skip to main content

మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??

మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??
మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు రాజధానుల గురించి ఒక ప్రపోజల్ పెట్టిన విషయం తెల్సిందే. అమరావతి, కర్నూల్, వైజాగ్ లను రాజధానులుగా మార్చే అవకాశం ఉందంటూ చేసిన స్టేట్మెంట్ కు భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని సమర్దిస్తుంటే, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని దుయ్యబడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెల్సిందే. ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఈ నిర్ణయంపై జగన్ ను ఏకిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్న చిరంజీవి నుండి అంటూ ఒక ప్రెస్ నోట్ వచ్చింది. దీని ప్రకారం మూడు రాజధానుల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆ నోట్ లో ఉంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి దీనిపై చర్చించుకోవడం కనిపించింది.

అయితే నిన్న అంటే 22న మరో ప్రెస్ నోట్ వచ్చింది. తాను మూడు రాజధానులపై ఎటువంటి ప్రెస్ నోట్ విడుదల చేయలేదని, ప్రస్తుతం తన దృష్టాంతా సినిమాల మీదే ఉందన్నది దాని సారాంశం. ఇలా రెండు రోజుల్లో రెండు భిన్న ప్రెస్ నోట్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ లో, జనసైనికులలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మరో క్లారిఫికేషన్ వచ్చింది. రాజధానుల నిర్ణయంపై తాను ఎటువంటి ప్రకటన చేయలేదు అంటూ వచ్చిన ప్రెస్ నోట్ ఫేక్ అని చిరంజీవి చెబుతున్నట్లుగా ఒక ఆడియో క్లిప్, మరో నోట్ మీడియాకు విడుదల చేసారు.

దీని బట్టి అర్ధం చేసుకోవాల్సింది. మూడు రాజధానుల నిర్ణయంపై చిరంజీవి స్పందించారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఆ ఆడియో క్లిప్ ను మిమిక్రీ చేసారంటూ ఇప్పుడు జనసైనికులు కొత్త వాదన మొదలుపెట్టారు. చిరంజీవి ఇటువంటి ప్రకటన చేసి ఉండరని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్నదమ్ములైనంత మాత్రాన ఇద్దరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఉండాలని లేదు. అలా ఉన్నంత మాత్రాన అదేమీ తప్పు కాదు. భిన్నాభిప్రాయాలు ఉన్నా వారిద్దరూ ఒకటి కాకుండా పోలేరు. సో, మూడు రాజధానుల నిర్ణయం అనే కాదు, భవిష్యత్తులో ఏ నిర్ణయంపైనైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ విభేదించవచ్చు. దీనిపై రాద్ధాంతం అనవసరం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35P5Mvb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...