Skip to main content

ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!

ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!
ప్లాప్ నిర్మాత అయినా ఎక్కడా తగ్గట్లేదు!!

హీరోలు, దర్శకులకే కాదు నిర్మాతలకు కూడా సినిమాలు హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం. సినిమాలు విజయాలు సాధించకుండా, ప్లాపులు అవుతుంటే మరో సినిమా నిర్మించడానికి ఏ నిర్మాత కూడా సాహసం చేయడు. ఎందుకంటే సినిమా ప్లాప్ అయిందంటే హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు కెరీర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆ సినిమాకు రావాల్సిన రెమ్యునరేషన్ ముందే తీసేసుకుంటారు కాబట్టి అక్కడి వరకూ ఫైన్. అదే నిర్మాతకు అయితే కెరీర్ తో పాటు ఫైనాన్సియల్ గా కూడా డేంజర్ లో పడతాడు. అప్పటికే కట్టుకోవాల్సినవి, బాకీలు తీర్చుకోవాల్సినవి నిర్మాతకు చాలానే ఉంటాయి. అందుకే సినిమాల విజయాల శాతం బాగా తగ్గిపోయినా ఇంకా కొంత మంది సినిమాల మీద ప్యాషన్ తోనే నిర్మాణ రంగంలో కంటిన్యూ అవుతున్నారు. అవే డబ్బులు వేరే రంగాలలో పెట్టుకుంటే దీనికి రెట్టించిన లాభాలు సంపాదించుకోవచ్చు.

ఇప్పుడు చెప్పినదానికి ఉదాహరణగా ఒక నిర్మాత గురించి ప్రస్తావించుకోవచ్చు. పేరుకి తక్కువ సినిమాలే తీసినా అన్నీ కూడా భారీ బడ్జెట్ లే తీసాడు. అయితే ఈ నిర్మాత తీసిన రెండు సినిమాలూ కూడా దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. ఈ నిర్మాత మరెవరో కాదు మిర్యాల రవీందర్ రెడ్డి. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. తన తొలి సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో. మొదటి సినిమానే గౌతమ్ మీనన్ వంటి టాలెంటెడ్ దర్శకుడు దొరకడంతో ఈ నిర్మాత ఫుల్ ఖుషీ. అయితే సాహసం శ్వాసగా సాగిపో రిజల్ట్ ఏంటో మనందరికీ బాగా తెలుసు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అటు బిజినెస్ సరిగ్గా అవ్వలేదు, ఇటు సినిమా ప్లాప్ కూడా అయింది. దీంతో మిర్యాల రవీందర్ రెడ్డికి మొదటి సినిమానే దారుణమైన దెబ్బగా మిగిలింది.

అయితే ఎలాగోలా తేరుకుని రెండో సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయక చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫలితం కూడా దారుణంగా బెడిసికొట్టింది. సినిమా టాక్ బాగానే వచ్చినా బెల్లంకొండ మార్కెట్ కు మించి రెండింతలు పెట్టుబడి పెట్టడం పెద్ద దెబ్బగా మిగిలింది. ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు సినిమాలతో ఇక ఆ నిర్మాత తేరుకోడేమో అనుకున్నారు. కానీ మళ్ళీ బోయపాటితోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాలకృష్ణ – బోయపాటి శ్రీను చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నాడు. అయితే అందరూ ప్లాపుల్లో ఉన్నా కానీ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వరట. ఈ సినిమాకు దాదాపు 40 నుండి 50 కోట్ల వరకూ బడ్జెట్ వేసుకున్నట్లు ప్రాధమిక అంచనా. భారీ కాస్ట్ అండ్ క్రూ ను ఆల్రెడీ దించే ప్రయత్నంలో ఉన్నారు. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలయ్యకు 50 కోట్లు అంటే చాలా పెద్ద రిస్క్. మరి మూడో సినిమాతోనైనా ఈ నిర్మాత హిట్ అందుకుంటాడేమో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2s7CvwU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...