Skip to main content

వెంకీని సరిగ్గా వాడుకుంటే రచ్చ లేపుతాడుగా

వెంకీని సరిగ్గా వాడుకుంటే రచ్చ లేపుతాడుగా
వెంకీని సరిగ్గా వాడుకుంటే రచ్చ లేపుతాడుగా

వెంకటేష్ కు విక్టరీ అన్న ట్యాగ్ లైన్ రావడం వెనుక అతని సక్సెస్ఫుల్ చిత్రాల ప్రయాణం ఉంది. వెంకీ అనగానే గుర్తొచ్చేది అతని కామెడీ టైమింగ్. సెంటిమెంటల్ రోల్స్ ఎన్నో వేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన వెంకటేష్, కామెడీ టైమింగ్ విషయంలో మాత్రం తిరుగులేదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాల్లో వెంకీ కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. ఆ మధ్య వెంకీ హవా కొంత తగ్గినట్లు అనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాడు. యువ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఏదైనా తన వయసుకు తగ్గ పాత్ర వస్తే తానే మెయిన్ హీరోగా చేస్తున్నాడు. ఇలా వెంకీ తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నాడు.

సోలో సినిమాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా సీరియస్ రోల్స్ చేస్తోన్న వెంకీ, యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తున్నప్పుడు మాత్రం కామెడీ వైపు చూస్తూ చెలరేగిపోతున్నాడు. ఎఫ్ 2 లో వెంకటేష్ ఏ రేంజ్ లో రచ్చ చేసాడో మనందరం చూసాం. ఎఫ్ 2 ఆ రేంజ్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వెంకీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వెంకటేష్ లేటెస్ట్ సినిమా వెంకీ మామ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ యావరేజ్ గా ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో తిరుగులేకపోవడానికి వెంకీనే మెయిన్ అట్రాక్షన్ అనడానికి వెంకీ కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ లెక్కన సరైన దర్శకుడు పడితే వెంకటేష్ చెలరేగిపోతాడు అంటూ ప్రేక్షకులు చర్చించుకోవడం కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఎప్పటినుండో చర్చల దశలో ఉంది. కామెడీ అనగానే త్రివిక్రమ్ పంచ్ లతో పిచ్చెక్కిస్తాడు, ఆల్రెడీ వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు పనిచేసిన అనుభవముంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఎలాగైనా త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది జరిగే పనేనా??



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sCEI3v

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...