Skip to main content

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ

నటీనటులు: అజ్మల్ అమీర్, బ్రహ్మానందం, అలీ, మహేష్ కత్తి తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి
దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు, రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019
రేటింగ్: 1.5/5

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా తన పట్టుని కోల్పోయి చాలా కాలమైంది. కేవలం తన ఉనికిని నిలుపుకొవడానికే ప్రస్తుతం సినిమాలు తీస్తున్నాడు వర్మ. తన ప్రతి సినిమా ప్లాప్ అయినా కూడా మళ్ళీ కొత్త సినిమాకు క్రేజ్ తీసుకురావడమెలాగో వర్మకు బాగా తెలుసు. అలాగే ఈసారి ఫిక్షనల్ పొలిటికల్ సెటైర్ అంటూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… కాదు కాదు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను దించాడు వర్మ. సెన్సార్ సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పాడు కానీ సినిమాలోని ప్రధాన పాత్రల దగ్గరనుండి ప్రతి చిన్న పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పాత్రలనే గుర్తుకుతెస్తాయి. రూలింగ్ లో ఉన్న వెలుగు దేశం పార్టీని మట్టికరిపించి విఎస్ జగన్నాథరెడ్డి(అజ్మల్ అమీర్)కు చెందిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఆ తర్వాత నుండి రాజకీయ పరిస్థితులు మారి వెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని రమ హత్యకు గురవుతాడు.

ఆ హత్యతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి? మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? దాని తర్వాత పర్యవసానాలు ఎలా సాగాయి అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవడానికేం లేదు. ఎందుకంటే ఇందులో ఎవరి గురించి చెప్పాలన్నా నటించారు అని చెప్పడానికి లేదు. బాగా ఇమిటేట్ చేసారు అనే చెప్పాలి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్.. ఇలా ప్రముఖులు అందరినీ పోలిన పాత్రలు ఇందులో ఉంటాయి. ఆయా పాత్రలకు ఎంపికైన వారు పెర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అందరికంటే కెఏ పాల్ ను పోలిన పాత్రను పోషించిన వ్యక్తి, నారా లోకేష్ ను పోలిన పాత్రను పోషించిన వ్యక్తి ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. మిగతా వారు కూడా ఇమిటేషన్ లో ఎక్కడా తగ్గలేదు.

సాంకేతిక వర్గం:
ముందుగా ఈ సినిమాకు కాస్టింగ్ చేసిన వ్యక్తిని మెచ్చుకుని తీరాలి. ప్రతీ పాత్రకూ సరిగ్గా సరిపోయేలా నటులను ఎంపిక చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో ఆర్జీవీ పాత్ర కూడా కీలకం కాబట్టి అంతవరకూ తనను మెచ్చుకోవచ్చు. జగదీశ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. కథలో మ్యాటర్ లేనప్పుడు ఏ ఎడిటర్ అయినా చేయగలిగేది ఏముంటుంది. రామ్ గోపాల్ వర్మ దీన్నొక స్పూఫ్ లా తీద్దామనుకున్నాడు. అంతవరకూ బానే ఉంది కానీ కనీసం ఎంటర్టైనింగ్ వే లో అయినా చెప్పి ఉండాల్సింది. అసలు దీనికి కథంటూ ఏం లేదు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఒకటి తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోయి, భవిష్యత్తులో ఇదీ జరిగేది అంటూ అర్ధం పర్ధం లేని ఒక ఫిక్షన్ ను జోడించి, దానికి అర్ధం పర్ధం లేని స్క్రీన్ ప్లే ను జతచేసి వదిలారు వర్మ అండ్ కో. దర్శకత్వ ప్రతిభ గురించి మళ్ళీ ప్రస్తావించుకునేది ప్రత్యేకంగా ఏం లేదు. నిర్మాణ విలువలు ఓకే.

చివరిగా:
అర్ధం పర్ధం లేని సినిమాలు ఎన్నో తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలులో పీక్స్ చూపించాడు. స్పూఫ్ వీడియోలను ఒకటి తర్వాత ఒకటి పేర్చుకుంటూ వెళ్లిపోయారు. పోనీ అది కూడా సరిగ్గా చేసింది లేదు. ఏదో ఆడియన్స్ పై పగ పట్టేసినట్లు ఈ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sivn0I

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...