Skip to main content

కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్

కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్
కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్

విక్టరీ వెంకటేష్ తెలుగులో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించాడు. కెరీర్ మొదటినుండి ఇమేజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పాత్ర అండర్ ప్లేలా ఉంటుందన్నా కూడా కథ నచ్చితే ఓకే చేసేస్తాడు. తన మీద పంచ్ లు వేయించుకునే హీరోలలో వెంకీ ఎప్పుడూ ముందుంటాడు. అయితే సీనియర్ హీరోగా వెంకటేష్ తన రేంజ్ ఏంటో, ఎలాంటి సినిమాలు తనకు నప్పుతాయో త్వరగా గ్రహించాడు. అందుకే అందరు సీనియర్ హీరోల కంటే ముందే, టాప్ హీరోలు, కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలకు పచ్చ జెండా ఊపేసాడు. సోలోగా సినిమా చేయలాంటి గురు వంటి దమ్మున్న సినిమాలే సైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒప్పుకున్నదే అసురన్ రీమేక్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం పట్ల వెంకీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సురేష్ బాబును ఒప్పించి మరీ ఈ సినిమా చేద్దామన్నట్లుగా వెంకీ చేసాడని ఒక రూమర్ ఉంది.

ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ విడుదలై అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సో వెంకీ నెక్స్ట్ దృష్టి అసురన్ రీమేక్ పైనే. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. అసురన్ రీమేక్ వెంకీ కెరీర్ లో 74వ చిత్రం. దీన్ని నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి వేసవికల్లా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అసురన్ రీమేక్ సంగతి పక్కనపెడితే వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ఏమిటనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ స్పెషల్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఇద్దరు కుర్ర దర్శకులు పోటీ పడుతున్నట్లు సమాచారం.

అందులో ఒకరు తరుణ్ భాస్కర్ కాగా మరొకరు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 సక్సెస్ తర్వాత ఎఫ్ 3 సబ్జెక్ట్ రాస్తున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించాడు. అలాగే, తరుణ్ భాస్కర్ కూడా మీకు మాత్రమే చెప్తా మీడియా ఇంటరాక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక కథను రాస్తున్నట్లు స్పష్టం చేసాడు. మరి వీరిద్దరిలో వెంకీ ఓటు ఎవరికో అన్నది ఆసక్తికరంగా మారింది. టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వెంకటేష్ తో సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఎప్పటికి కుదురుతుందో ఇప్పుడే చెప్పలేం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34meEqD

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...