Skip to main content

రామ్ గోపాల్ వర్మకు తగిలిన కరోనా వైరస్ సెగ

RGV facing Coronavirus Effect
RGV facing Coronavirus Effect

టైటిల్ చూసి రామ్ గోపాల్ వర్మ కి కరోనా వైరస్ వచ్చిందేమో.?  అని ఆనంద పడకండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని గనుక కుడితే తేలు;  ఒకవేళ కరిస్తే పాము; ఒకవేళ వస్తే వైరస్… అవి చచ్చిపోవాల్సిందే తప్ప గురువు గారికి కనీసం గడ్డం లో ఉండే తెల్ల వెంట్రుక కూడా ఓడిపోదు. మరి ఇప్పుడు విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ  గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా పేరు “ఎంటర్ ద  గర్ల్ డ్రాగన్.”

ఇక ఈ సినిమాలో ప్రేమ, వ్యామోహం, ఆకర్షణ, పగ, ప్రతీకారం లాంటి అంశాలను మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ అనే అంశానికి ఒక రకమైన దేవుడు లాంటి బ్రూస్ లీ కి ఇచ్చే ఒక ట్రిబ్యూట్ మాదిరిగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వరకు చైనా వెళ్లి షూటింగ్ చేయాలి. బ్యూటిఫుల్ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పనిమీద చైనా వెళ్లారు. ఇంతలో అనుకోకుండా అక్కడ కరోనా వైరస్ ప్రభావం చూపించి, అన్ని బిజినెస్ లతో పాటు అన్ని రకాల సినిమా షూటింగ్ లకు అంతరాయం ఏర్పడింది. ఇక కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ఎంటర్ ద గర్ల్ డ్రాగన్” సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.

 మిగిలిన కొంచెం బ్యాలెన్స్ వర్క్ చైనాలో షూట్ చేయాలి దానికి ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. మరోవైపు చూస్తే గురువుగారు పరిస్థితులకు కాంప్రమైజ్ అవ్వని  వ్యక్తి. ప్రస్తుతం అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఈ కరోనా వైరస్ అనేది తగ్గాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి మనం లెక్కలు పరిశీలించినట్లయితే అమెరికా వాడికి ఎప్పుడు డబ్బులు తగ్గుతాయో.?  అప్పుడు ప్రపంచం లోకి ఒక కొత్త వైరస్ బయటకు రావడం అందరికీ తెలిసిన విషయమే.

 మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో “ఎంటర్ ద గర్ల్ డ్రాగన్” సినిమా బ్యాలెన్స్ వర్క్ చైనా లో షూట్ చేస్తారా.?  లేకపోతే వేరే లొకేషన్లను వెతుక్కొని సినిమాని కంప్లీట్ చేస్తారా.? అనేది ఆర్జీవీ ముందు ఉన్న ప్రశ్న.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vJvNyZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...