Skip to main content

ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!

ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!
ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కొమ‌రం భీంగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌రణ ద‌శ‌లో వుండ‌గానే ఈ హీరోలిద్ద‌రు త‌మ త‌దుప‌రి చిత్రానికి రెడీ అవుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ ఓ ప‌క్క మెగాస్టార్‌తో కొర‌టాల రూపొందిస్తున్న సినిమా ప‌నుల్లో బిజీగా గ‌డిపేస్తూరే మ‌రో ప‌క్క త‌దుపరి చిత్రం కోసం `జెర్సీ` ద‌ర్శ‌కుడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది.

ఎన్టీఆర్ మాత్రం త‌న త‌దుపరి చిత్రాన్ని మాట‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం ఓ ప‌వర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశార‌ట‌. వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో `అర‌వింద స‌మేత‌` రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సీమ ముఠా క‌క్ష‌లు ఐదు రూపాయ‌ల ఫ్యాక్ష‌న్ వంటి వ‌ర్గ పోరుని చూపించి పాలిటిక్స్‌ని పైపైన ట‌చ్ చేసిన త్రివిక్ర‌మ్ తాజా సినిమాకు మాత్రం కంప్లీట్ పొలిటిక‌ల్ నేప‌థ్యాన్ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి తీసుకొచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని తెలిసంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రుంటారు?. ఎన్టీఆర్ పాత్ర చిత్ర‌ణ ఎలా వుంటుంది? అన్న విష‌యాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OJzs6a

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...