Skip to main content

సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార

సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార
సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార

బాలీవుడ్ సినిమాల్లో సౌత్ స్టార్స్ నటించాలని పరితపించే స్థాయి నుండి ఇప్పుడు బాలీవుడ్ తారలే సౌత్ సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి రాజమౌళి, శంకర్, మణిరత్నం, మురుగదాస్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ప్రధాన కారకులు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ ను నటిస్తున్న విషయం తెల్సిందే. అజయ్ దేవగన్ ఇప్పటికే షూట్ లో పాల్గొంటుండగా, అలియా భట్ ఇంకా షూట్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పుడు సౌత్ సినిమాలు ఎక్కువగా ప్యాన్ ఇండియా రిలీజ్ లపై దృష్టి పెడుతున్నాయి. అందుకే రీచ్ కోసం బాలీవుడ్ తారలను సంప్రదిస్తున్నాయి. ఆ నటులు కూడా సౌత్ లో తమకు గుర్తింపు వస్తుందని ఒప్పుకుంటున్నారు. ఇలా ప్యాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ నటుల కోలాహలం ఎక్కువైంది.

గతేడాది అందరి దృష్టిని ఆకర్షించిన కేజిఎఫ్ విషయానికొస్తే మొదటి చాప్టర్ లో పేరున్న నటులు ఎవరూ పెద్దగా లేరు. కోలీవుడ్ సూపర్ స్టార్ యష్ నటించినా ఈ సినిమాకు ముందు తను బయట పెద్దగా తెలీదు. అయితే రెండో చాప్టర్ విషయానికొచ్చేసరికి దర్శకుడు సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాడు. కథ రీత్యా రెండో భాగంలో కొత్త పాత్రల పరిచయం జరగనుంది. ఇప్పటికే అధీరా పాత్రకు గాను సంజయ్ దత్ ను తీసుకున్న సంగతి తెల్సిందే. తన లుక్ ను కూడా విడుదల చేసారు. మొదటి భాగంలో విలన్ కంటే మరింత పవర్ఫుల్ గా అధీరా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో బాలీవుడ్ తార ఈరోజు కేజిఎఫ్ 2 సెట్స్ లో జాయిన్ అయింది. ఆమె రవీనా టాండన్. ఈమె రమిక సేన్ పాత్రలో హల్చల్ చేయనుంది. మొదటి భాగంలో ఈమెను వెనక నుండి చూపిస్తారే తప్ప నటుడెవరన్నది చూపించరు. పైగా రాకీ భాయ్ పై డెత్ వారంట్ ఇష్యూ చేస్తున్నట్లుగా చూపిస్తారు. దీన్ని బట్టి రెండో భాగంలో ఈమె పాత్రకు ప్రాధాన్యత బానే ఉంటుందని అర్ధమవుతోంది. మే లేదా జులైలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UO2jKP

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...