Skip to main content

షాకిస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు

mind boggling numbers of RRR business
షాకిస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు

నాలుగైదేళ్ల క్రితం ఎవరైనా కల గన్నామా.. టాలీవుడ్ మార్కెట్ 100 కోట్లు దాటుతుందని, కలలోనైనా ఊహించామా ఓవర్సీస్ లో 20 మిలియన్ డాలర్లు సాధ్యమేనని. ఒక తెలుగు సినిమా హిందీలో కూడా రఫ్ఫాడేస్తుందంటే అప్పట్లో నమ్మామా.. అయితే వీటన్నిటినీ నిజం చేసి చూపించాడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి 1 అండ్ 2 చిత్రాలతో తెలుగు మార్కెట్ ను దశదిశలా వ్యాప్తి చేసేసాడు. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రకటించినప్పుడు ఇది అంత పెద్ద స్థాయి సినిమా కాదనుకున్నారు. తెలుగులో ఓకే కానీ మిగిలిన భాషల్లో ఆ స్థాయిలో మళ్ళీ బిజినెస్ చేయడం కష్టమేనని, అంత బజ్ మళ్ళీ రాజమౌళికి కూడా సాధ్యం కాదని భావించారు.

అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం మేకింగ్ లో ఉంది. రిలీజ్ కు ఇంకా 11 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటినుండే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు అంటూ వస్తున్న వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో బిజినెస్ ఫైనల్ కాకపోయినా ప్రాధమికంగా వినిపిస్తున్న ఫిగర్ లు ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. బాహుబలి 2 స్థాయిలో కాదు, దాన్ని మించే స్థాయిలో బిజినెస్ జరగనుందని సంకేతాలు అందుతున్నాయి.

బాహుబలి 2 సమయం అప్పుడు దిల్ రాజు నైజాం హక్కుల కోసం 50 కోట్లు పెట్టడానికి సిద్ధపడితే అందరూ రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. అయితే పెట్టిన దానికి 20 కోట్ల లాభాలను కళ్లజూశాడు. అలాగే మిగిలిన ఏరియాలు అన్నీ కలిపి బాహుబలి 2 తెలుగు రాష్ట్రాల నుండే 125 కోట్లకు బిజినెస్ జరిగింది. దాన్ని తలదన్నేలా దాదాపు 200 కోట్ల షేర్ ను అందుకుంది ఈ చిత్రం.

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 225 కోట్ల బిజినెస్ జరగనుందని ప్రాధమికంగా తెలుస్తోంది. నైజాంలో మరోసారి దిల్ రాజు 75 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. పెద్ద సినిమా సినిమాలకు జరిగే బిజినెస్ ఆర్ ఆర్ ఆర్ కు ఒక్క నైజాం ఏరియాకే జరుగుతుందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3biRoyi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...