Skip to main content

కరోనా వైరస్ ని తయారు చేసింది మనుషులేనా.?

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం కరోనా వైరస్. ఇప్పటికే ఆసియా లోని పలుదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు ఇండియాలో, అందులోనూ హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ప్రజలను తీవ్రంగా భయపెడుతోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకూ మందు కనిపెట్టలేదు ప్రస్తుత ఆధునిక ప్రపంచం.

కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. చైనాలో ఉండే క్రైట్, కోబ్రా అనే కూడా విషపూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వలన వైరస్ వ్యాప్తి చెంది ఉంటుంది అని అక్కడ అభిప్రాయపడుతున్నారు.చైనా లో ఉన్న వూహాన్‌లోని సిఫుడ్  మార్కెట్‌ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్నారు. 2002- 2003 మధ్య కరోనా వైరస్ లాంటి రకమే అయిన సార్స్ వైరస్ ప్రపంచ దేశాలకూ వ్యాపించింది.

మన దేశంలో కేరళలో ఏడుగురికి, హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా, ఇది వైరస్ కాబట్టి… గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి వచ్చే అవకాశం ఉంది. చైనాలో అంతర్జాతీయ యూనివర్సీటీలలో వందలాది మంది భారతీయ విద్యార్థులున్నారు.

ఈ వైరస్ నేపథ్యంలో భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, హాంగ్‌కాంగ్, అమెరికా వంటి దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా థర్మోస్ స్కాన్ చేస్తున్నారు.ఈ వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపై చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, కిడ్నీ వంటి కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.

చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది.ఈ వైరస్ పెంపుడు జంతువులతో పాటు, ప్రధానంగా పాముల నుంచి సంక్రమించినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రకటించింది. ఈ వ్యాధికి చికిత్స కానీ, అడ్డుకోగలిగిన వ్యాక్సీన్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

ఇది సోకకుండా ఉండాలంటే, అపరిచితులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకరాదు. నిత్యం మాస్కులు ధరించాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. ముఖ్యంగా చలి వాతావరణంలో ఉండకూడదు. పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

ప్రస్తుతం ప్రపంచంలో గత ఇరవై ఏళ్లుగా ఆంత్రాక్స్, సార్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా, నిఫా, ఇప్పుడు కరోనా ఇలా ఎన్నో రకాల వైరస్ లు బయటకు వస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుని జరిగే పనులు జరిగిపోతున్నాయి. కానీ మామూలు మనుషులకు అర్ధం కాని ఈ వికృత క్రీడలో బలవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. కొంతమంది స్వార్ధపరులు అధికారం, ఆధిపత్యం, అహంకారం కోసం జరిగే యుద్ధాలు గతంలో కోట్లమంది మనుషులు,ఆయుధాలు, శ్రమతో జరిగితే ఇప్పుడు గుప్పెడు క్రిములను జనాల్లో విసిరేసి, వాళ్ళు చస్తూ ఉంటే, ఆ భయాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఇంత సీరియస్ అయిన ఈ వైరస్ గతంలో కూడా ఉండేదా.?

ఎందుకు ఈ వైరస్ కు ఇప్పటివరకూ మందు కనిపెట్టలేదు.?

ప్రపంచంలో ఎందుకు కొన్ని దేశాల్లోనే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతోంది.?

అసలు ఈ వైరస్ నిజంగా నేచర్ నుండి వచ్చిందా.?

లేక కొంతమంది స్వార్ధపరులు వారి శత్రువులను టార్గెట్ చేసుకుని ప్రయోగిస్తున్నారా.? అనే ప్రశ్నలు ప్రజలందరిలో ఉన్నాయి.

Is CoronaVirus was man-made.?
కరోనా వైరస్ ని తయారు చేసింది మనుషులేనా.?


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vWG8Yb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...