Skip to main content

ఈసారి పక్కా “యూత్” సినిమా తీస్తానంటున్న దర్శకుడు

Director Dilip Raja second film “Youth”
Director Dilip Raja second film “Youth”

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు దర్శకుడు దిలీప్ రాజా. దిలీప్ రాజా గారు దూరదర్శన్ తో సహా అనేక ఛానెల్స్ కు విజయవంతమైన ధారావాహికలు, సీరియల్స్, ఫీచర్ ఫిలిమ్స్ తీసారు. ఫ్యామిలీ, లవ్, కామెడీ, డివోషనల్, మెసేజ్ ఓరియెంటెడ్ ఇలా అన్నిరకాల సబ్జెక్టులతో కాన్సెప్ట్ లు తియ్యడం ఆయన ప్రత్యేకత. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలకు సంబంధించి దిలీప్ రాజా గారు సినీ నటులు బాలకృష్ణ గారితో పలు అడ్వర్టైజ్మెంట్ లు చేసారు. ఇక దిలీప్ రాజా గారు చేసిన అంబేద్కర్ జీవిత చరిత్ర  సీరియల్ నిజంగా బుల్లితెర పై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోటీకి పైగా వ్యూయర్ షిప్ తో ఆ సీరియల్ 100 కు పైగా ఎపిసోడ్స్ తో పెద్ద హిట్ గా నిలిచింది. అనేక భారతీయ బాషలలోకి కూడా అనువాదం చెయ్యబడింది.

ఇక హాస్యనటుడు అలీతో దిలీప్ రాజా తీసిన పూర్తి స్థాయి కామెడీ సినిమా “పండుగాడి ఫోటో స్టూడియో” గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ధన్య బాలకృష్ణ మెయిన్ రోల్ లో నటిస్తోంది.  మెర్సీ కిల్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక సరదా లవ్ స్టోరీ చిత్ర యూనిట్ తెలిపింది. “పండుగాడు…” సినిమా లాగే ఈ సినిమా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ న్యాచురల్ లోకేషన్స్ లో తీస్తానని డైరెక్టర్ దిలీప్ రాజా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కూడా అనేకమంది కొత్త ఆర్టిస్ట్ లకు, టెక్నీషియన్స్ కు అవకాశాలు ఇస్తున్నట్లు మూవీ టీం చెప్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య మరియు సాహిత్య రచయిత రాంబాబు గోసాల పనిచేస్తున్నారు. ఇక సినిమా టైటిల్ ను “యూత్” అని ఫిక్స్ చేసారు. “కుర్రాళ్ళ గుండె చప్పుడు” అనేది సబ్ టైటిల్. 22 ఏళ్ల కుర్రాడు కోర్టును మెర్సీ కిల్లింగ్ కోసం పర్మిషన్  అడుగుతాడు. అందుకు ఆ జడ్జ్ ఎందుకు అని అడిగితే ఆ కుర్రాడు నేటి సమాజంలో కుర్రాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో.. ఎలాంటి బాధలను భరిస్తున్నాడో చెప్తాడు అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3bpDevt

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...