Skip to main content

విజయ్ విషయంలో రాశి కాన్ఫిడెన్స్ మాములుగా లేదుగా

rashi khanna talks about vijay deverakonda quitting love stories
విజయ్ విషయంలో రాశి కాన్ఫిడెన్స్ మాములుగా లేదుగా

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా థియేట్రికల్ ట్రైలర్ తో పరిస్థితిలో మార్పు వచ్చింది. దీనిపై నెమ్మదిగా బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో మొత్తంగా నలుగురు హీరోయిన్లు నటించారు. రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటించగా అందరిలోకీ రాశి ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఇటీవలే మీడియాతో ముచ్చటించిన రాశి.. విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ ఇటీవలే చిత్ర థియేట్రికల్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన ఆలోచనలో మార్పు వచ్చిందని, ప్రేమ కథలు ఇకపై చేయనని, అవి ఇంక బోర్ కొట్టేశాయని ప్రకటించుకున్న విషయం తెల్సిందే. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం తాను నటించిన ప్యూరెస్ట్ లవ్ స్టోరీ అని ప్రకటించాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్టైన సినిమాల్లో 90 శాతం ప్రేమకథలే. ఆ మిగిలిన 10 శాతంలో కూడా ప్రేమ కథ అంతర్లీనంగా ఉంటుంది. పైగా విజయ్ ను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆ లవ్ స్టోరీలు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ ను లవ్ స్టోరీల్లో కాకుండా వేరే జోనర్ సినిమాల్లో చూడడానికి ఇష్టపడతారు అన్నది అసలు ప్రశ్న.

ఇక ఇదే ప్రశ్న రాశిని అడిగితే.. విజయ్ లవ్ స్టోరీలు చేయకుండా ఉండలేడు అంటోంది. ఇప్పటికి అతనికి అలా అనిపించి ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో కచ్చితంగా లవ్ స్టోరీలు చేస్తాడు, అతణ్ణి అమ్మాయిలు లవ్ స్టోరీల్లో చూడటానికే ఇష్టపడతారు. పైగా ప్రేమకథలు ఎప్పటికీ అవుట్ డేట్ కావని ఆమె అభిప్రాయపడింది.

ఇక విజయ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ.. విజయ్ నటిస్తున్నప్పుడు అతని హావభావాలు మానిటర్ లో చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇంత నటన ఎక్కడ నుండి వచ్చిందా అనుకునేదాన్ని. అయితే అతను థియేటర్ ఆర్టిస్ట్ అని తర్వాత తెలిసింది. విజయ్ చాలా గొప్ప పెర్ఫార్మర్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vmL4Fn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...