Skip to main content

నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!

నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!
నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!

యంగ్ హీరో నితిన్ వరసగా మూడు ప్లాపులు కొట్టాడు. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. నితిన్ నుండి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ గ్యాప్ లో వరసగా సినిమాలను సెట్ చేసుకున్నాడు నితిన్. ఈ చిత్రాలు ఎక్కువగా రొమాంటిక్ ఎంటర్టైనెర్స్ కావడం విశేషం. తన బలమేంటో తెలుసుకుని దాని ప్రకారం కథలను సెట్ చేసుకున్నాడు. ముందుగా ఛలో వంటి సూపర్ హిట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. భీష్మ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో పది రోజుల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 21న భీష్మ విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి.

భీష్మ విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తనతో పాటు సినిమాలో హీరోయిన్ గా చేస్తోన్న రష్మికకు కూడా సమ ప్రాధాన్యం దక్కేలా చూసుకుంటున్నాడు. పోస్టర్లు, ప్రోమోలు ఇలా ఏమైనా కానీ రష్మిక కూడా ప్రమోషన్స్ లో హైలైట్ అవుతోంది. ప్రస్తుతం ఈ భామకు సరిలేరు నీకెవ్వరు వల్ల మాస్ ఇమేజ్ వచ్చింది. అందుకనే పోస్టర్లలో కూడా రష్మిక గ్లామరస్ ఫోజులు హైలైట్ అయ్యేలా చూడాలని చెప్పాడు.

ఇక భీష్మ తర్వాత నితిన్ చేస్తోన్న చిత్రం రంగ్ దే. తొలిప్రేమ, mr. మజ్ను చిత్రాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి డైరెక్షన్ ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన కీర్తికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. ఆమెను మహానటి కథానాయికగానే చూస్తున్నారు. సో రంగ్ దే విషయంలో కూడా కథానాయికను హైలైట్ చేయమని సూచించాడు నితిన్. ఈ హీరోకు కంబ్యాక్ హిట్ గా చెప్పుకునే ఇష్క్ విషయంలో నితిన్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. అందులో నిత్యా మీనన్ ఎంతలా హైలైట్ అయిందో మనందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ తన కంబ్యాక్ విషయంలో కూడా నితిన్ ఇదే స్టైల్ ఫాలో అవుతున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UELPnU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...