మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటింది. తమిళ ఈలం నేత వేళు పిళ్లై ప్రభాకరన్కు సంబంధించిన యాదార్థ సంఘటనల ఆధారంగా మంచు మనోజ్ చేసిన చిత్రం `ఒక్కడు మిగిలాడు`. ఈ సినిమా పరాజయం తరువాత మానసికంగా కొంత వైరాగ్యానికి లోనైన మంచు మనోజ్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతితో విడిపోయిన తరువాత త్వరలో ఫైర్ బాల్లా వెలగడానికి సిద్ధమవుతున్నానని, మరో వారం రోజుల్లో కొత్త అప్డేట్ ఇస్తానని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తించింది.
అన్నట్టే వారానికి మించి టైమ్ తీసుకున్నా మంచు మనోజ్ బ్రేకింగ్ న్యూస్తో వచ్చాడు. గురువారం ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మనోజ్ నటిస్తున్న తాజా చిత్రానికి `అహం బ్రహ్మస్మి` అనే టైటిల్ని కన్ఫమ్ చేశారు. ఈ టైటిల్ ఫస్ట్లుక్తో పాటు ఓ ఎమోషనల్ పోస్ట్ని కూడా మరోజ్ షేర్ చేశారు. `3 సంవత్సరాల తరువాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా సమయంలో ఏ భావోద్వేగంతో ఉన్నానో అదే భావోద్వేగంతో వున్నాను. ఈ మూడేళ్ల కాలంలో నాతో సహకరించిన వారందరికి ధన్యవాదాలు. నా జీవితాన్ని. నా కళను కోల్పోయాను. సినిమా అమ్మా వచ్చేశా`అంటూ ట్వీట్ చేశారు.
కొత్త తరహా కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్ మంచు మనోజ్ ఆర్ట్స్ బ్యానర్పై తల్లి నిర్మాలా దేవితో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 6న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నామని పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Coming forward to u guys after 3 years. Feel the same emotion as I felt for my first movie DD. Thanks for all ur love and support on and off-screen throughout this journey. I missed my Art which is my life. CineAmma, Vachesaaaa
Love you all Darlings. #AhamBrahmasmi #AB pic.twitter.com/VYevifoMBT
— MM*
(@HeroManoj1) February 13, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UIf3Cy



Comments
Post a Comment