Skip to main content

“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై ఐటీ దాడి వివాదం

“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై ఐటీ దాడి వివాదం
“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై ఐటీ దాడి వివాదం

గతంలో తమిళనాడులో రెండు రాజకీయ పార్టీల మధ్య ఆట లాగా సాగింది రాజకీయం. ఎప్పుడైతే రెండు రాజకీయ వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు మరణించడంతో ఇప్పుడు చాలా మంది ఆశవహులకు తమిళ నాడు ముఖ్యమంత్రి కుర్చీ పై కన్ను పడింది. ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నడిచిన తమిళనాడు లో జాతీయ రాజకీయ పార్టీలు తమ దృష్టి సారించాయి. ఇక ఆ కొంతమంది ఆశవహులకు తోడుగా తమ ఉనికి, వ్యాపారం, ఆధిపత్యం కోసం మిగిలిన తెర వెనుకశక్తులు పావులు కదుపుతున్నాయి. గత 5 ఏళ్ళుగా తమిళ సినిమాలు ఒక్కసారి పరిశీలిస్తే అందరు నటులు కథలు ఇలాంటివి ఎంచుకున్నా, కానీ కల్చర్ పరంగా తమిళ సంస్కృతి ని అంతర్లీనంగా చూపించడం జరుగుతోంది.

ప్రస్తుతం తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ కూడా రాజకేయల్లోకి వస్తారనే ప్రచారం ఉంది. దానికి తోడూ గత కొన్ని సినిమాలుగా ఆయన తను ఎంచుకునే కథలు, క్యారెక్టర్లు, డైలాగ్స్ లో కూడా ఆ ఫీల్ ఇస్తూ వస్తున్నారు. ఇక హిందుత్వానికి వ్యతిరేకంగా రామస్వామి నాయకర్ కలం నుండి ఒక వర్గం అధికారం కోసం ఒక కొత్త ఐడియాలజీ ని “ద్రవిడ వాదం” పేరుతో తీసుకువచ్చారు. నాస్తికత్వం ముసుగులో హిండుమతంపై విద్వేషాలు నూరిపోయ్యడం వీళ్ళ ప్రధాన అజెండా. ఇప్పుడు ఉన్నట్టుండి కమల్ హసన్, ప్రకాష్ రాజ్, విజయ్ వంటి వాళ్ళు బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం, రజనీకాంత్ తోపాటు ఇప్పుడు తెలుగు లో పవన్ కళ్యాణ్ లాంటి వారు బీజేపీ కు అనుకూలంగా మాట్లాడటం అంతా ఒక రాజకీయ క్రీడ మాదిరిగా ఉంది. ఇప్పుడు కొత్తగా విజయ్ నటించిన “బిగిల్” సినిమాకు సంబంధించి సదరు నిర్మాత కుమార్తె ట్విటర్ లో పెట్టిన పోస్ట్ ల ఆధారంగానే IT శాఖ వారు సోదాలు నిర్వహించామని చెప్తూ, సోదాల్లో దొరికిన కోట్ల డబ్బు, వజ్రాలు వంటివి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. నటుడు విజయ్ ఎంతోకాలంగా ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్య వైఖరి తో వ్యవహరిస్తున్నరనే విషయం కూడా తెలుస్తోంది. ఇక ఈ సమస్యను వీలైనంత రాజకీయ లబ్ధికి ఉపయోగించే అవకాశం ఉంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uvpfnd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...