Skip to main content

ఏడాదిలో మూడు రీమేక్ లు. దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో!

Dil raju three remakes in one year
Dil raju three remakes in one year

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని విషయాలంటే ఇష్టం ఉండదు. వారి అభిరుచుల ప్రకారమే సినిమాలు తీసుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి రీమేకులు అంటే పడదు. చూసిన చిత్రాన్ని మళ్ళీ చేస్తే ఎగ్జైట్మెంట్ ఉండదని ఫీలవుతాడు మహేష్. అందుకే తన 26 సినిమాల్లో ఒక్క రీమేక్ కూడా లేదు. ఇదే కోవలోకి చెందుతారు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా. తమ చిత్రాలు ఏవీ రీమేక్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు. నిర్మాతల విషయానికి దిల్ రాజు కూడా తన కెరీర్ మొదటి నుండి ఇదే ఫీలయ్యాడు. దిల్ రాజు ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసాడు కానీ ఒక్క సినిమాను కూడా రీమేక్ చేయలేదు. అయితే 2020లో మాత్రం దిల్ రాజు స్ట్రాటజీ మార్చాడు. ఈ ఏడాదే దిల్ రాజు నిర్మించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

ముందుగా దిల్ రాజు నిర్మించిన ఫస్ట్ రీమేక్ జాను. 96 చిత్రాన్ని చెన్నై వెళ్లి చూసొచ్చి, తెగ నచ్చేయడంతో తన నియమాన్ని పక్కన పెట్టేసి నిర్మించాడు. ఈ చిత్రం మరొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా మళ్ళీ సినిమాల్లోకి రప్పించాలన్న ఉద్దేశంతో పింక్ రీమేక్ బాధ్యతలను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం మే 15న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ రెండూ కాకుండా ఒక తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. తెలుగులో గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే కబీర్ సింగ్ రీమేక్ తో తిరిగి హిట్ ట్రాక్ లో పడ్డ షాహిద్, జెర్సీ రీమేక్ తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

ఇలా ఒకే ఏడాది మూడు రీమేక్ లు చేయడం పట్ల దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UueD2D

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...