Skip to main content

రాశి ఖన్నా ట్రోల్స్ గురించి చదివిందిట!

Rashi Khanna says World Famous Lover has the best story in her entire career
Rashi Khanna says World Famous Lover has the best story in her entire career

హీరోయిన్ గా రాశి ఖన్నా ఇప్పుడు బెస్ట్ ఫేజ్ లో ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైన రాశి, కెరీర్ లో మొదట ఎక్కువగా ప్లాప్స్ పలకరించడంతో కెరీర్ ఆశించినంత ముందుకెళ్ళలేదు. అయితే అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈమెకు అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. ఇటీవలే బాగా సన్నబడి నాజూకు అందాలతో యువతకు ఎర వేస్తున్న ఈ భామ, లాస్ట్ ఇయర్ వరస వారాల్లో విడుదలైన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల ద్వారా వరస సక్సెస్ లను అందుకుంది. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ సరసన రాశి నటించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. నిన్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

థియేట్రికల్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి. చిత్రంపై అంచనాలను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో రాశి ఖన్నా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిత్ర టీజర్ విడుదలయ్యాక రాశి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిన విషయం తెల్సిందే. టీజర్ లో ఆమె విజయ్ తో నటించిన లిప్ కిస్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లు చూసి ఫ్యాన్స్ ఇలాంటి సినిమా ఎందుకు చేశావన్నట్లుగా రాశిని ప్రశ్నించారు. కొంత మంది ట్రోల్స్ కూడా చేశారు. ఈ విషయం గురించి ప్రస్తావించిన రాశి తన ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం తెలిసి తాను కూడా బాధపడ్డానని, అయితే మీరు అనుకున్నట్లు చిత్రంలో ఉండదని, టీజర్ చూసాక కలిగినఅభిప్రాయం, చిత్రం చూసాక పూర్తిగా మారిపోతుందని ఆమె తెలిపింది. టీజర్ చూసాక కథ విషయంలో ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు. అయితే అంచనాలకు భిన్నంగా సాగుతుందీ చిత్రం. తన కెరీర్ లో కథ పరంగా ఇదే బెస్ట్ సినిమా అని తేల్చి చెప్పేసింది రాశి. మరి అమ్మడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉందంటే సినిమాలో విషయముందనే అనుకోవాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/385KlXX

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...