Skip to main content

మహేష్ బాబు మేనల్లుడి చిత్రం ఏమైంది?

What Happen Ashok Gallas Movie
What Happen Ashok Gallas Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ సూపర్ హై లో వెళ్తోంది. వరసగా మూడు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాలిడేలో ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా సంగతి వచ్చాక చూసుకుంటాడు. ఇప్పటికే వంశీ పైడిపల్లి తో ఈ సినిమా ఉంటుందని డిసైడ్ చేసేసాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇవన్నీ మంచి వార్తలే. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ నుండి తన బావ సుధీర్ బాబు ఒక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే మహేష్ కు ఎంతో ఇష్టమైన మరో బావ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేయాలన్న ప్రయత్నాలు గత కొంత కాలంగా జరుగుతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాణంలో ఒకసారి అలాంటి ప్రయత్నమే జరిగింది. కారణమేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. లాంచింగ్ దగ్గరే ఆగిపోయింది.

మళ్ళీ కొంచెం టైమ్ తీసుకుని ఈసారి భలే మంచి రోజు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్యను దర్శకుడిగా పెట్టుకుని అశోక్ గల్లా హీరోగా సినిమాను లాంచ్ చేసారు. శ్రీరామ్ ఆదిత్య తర్వాత శమంతకమణి, దేవదాస్ వంటి సినిమాలు తీసి ఉన్నాడు. అంగరంగ వైభవంగా అశోక్ గల్లా డెబ్యూ మూవీ లాంచ్ జరిగింది. ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ స్వయంగా వచ్చి తన విషెస్ చెప్పాడు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. జయదేవ్ గల్లా నిర్మాతగా మారుతూ అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్న విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇదంతా నవంబర్ లో జరిగింది. అయితే రెండు నెలలు పూర్తయినా ఈ సినిమా గురించి అప్డేట్ లేదు. నిధి అగర్వాల్ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉంది. మరి అశోక్ గల్లా తొలి సినిమా సంగతి ఏమైనట్లు? సైలెంట్ గా షూటింగ్ కానిచేస్తున్నారా? లేదా ఏదైనా కారణంతో బ్రేక్ ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/374WmeH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...