Skip to main content

సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!

సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!
సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!

నందు హీరోగా గుర్రం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సవారి. ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. డీసెంట్ రివ్యూలను తెచ్చుకుంది. కొన్ని నెగటివ్ అంశాలు ఉన్నప్పటికీ గుర్రం సెంటిమెంట్ ను చక్కగా వాడుకుంటూ, బి, సి సెంటర్లకు మంచి మాస్ విందును అందించారని క్రిటిక్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకు జనాల నుండి కూడా స్పందన బాగుంది. మెయిన్ గా పాటలు సూపర్ హిట్ అవ్వడంతో కలెక్షన్స్ పై అది ప్రభావం చూపించింది. మొదటిరోజు ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి. రెండో రోజు కూడా డీసెంట్ హోల్డ్ మైంటైన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సవారీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏరియాల వారీగా బ్రేక్ డౌన్ నంబర్లు ఇవ్వలేదు కానీ తమ చిత్రం బ్రేక్ ఈవెన్ కు మాత్రం చేరుకుందని ప్రకటించారు. అంటే ఇక ఆదివారం అయిన ఈరోజు నుండి బయ్యర్లకు లాభాలు మొదలుకానున్నాయన్నమాట.

నిజానికి సవారి చాలా తక్కువ బడ్జెట్ లోనే కానిచ్చేశారు. అలాగే టేబుల్ ప్రాఫిట్స్ తో బయ్యర్లకు అమ్మేసారు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ కావడం, అలాగే ట్రైలర్ కూడా జనాల నుండి మంచి స్పందన తెచ్చుకోవడంతో సవారి మార్కెట్ లో మంచి రేట్లకే అమ్ముడుపోయింది. దీనికి తోడు డిజిటల్ హక్కులు, సాటిలైట్ హక్కులు కలుపుకుని సవారి నిర్మాతకు లాభాలు పంట పండించినట్లే.

నందు సరసన ప్రియాంక శర్మ నటించిన ఈ చిత్రంలో బాద్షా పాత్ర పోషించిన గుర్రంది మరో మెయిన్ క్యారెక్టర్. ఇందులో నంది సవారి చేసే యువకుడిగా కనిపిస్తాడు. అదే తన జీవనాధారం. అయితే బాద్షాకు గుండెలో ప్రాబ్లెమ్ ఉందని తెలుస్తుంది. దానికి బోలెడంత డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో నందు ఏం చేసాడు? దానివల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్న కోణంలో సినిమా సాగుతుంది. సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి దర్శకుడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37aBUJt

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...