Skip to main content

మత్తు వదలరా రివ్యూ

Matthu Vadalara Movie Review in Telugu
Matthu Vadalara Movie Review in Telugu

మూవీ రివ్యూ: మత్తు వదలరా
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ..
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాత: చిరంజీవి, హేమలత
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: కాల భైరవ
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019
రేటింగ్: 3/5

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి తనయులు శ్రీసింహ హీరోగా, మరొకరు అయిన కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతూ నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రం ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించింది. న్యూ ఏజ్ థ్రిల్లర్ గా ప్రచారం కాబడ్డ ఈ చిత్రం అందరి అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ:
బాబు (శ్రీ సింహా), అభి (నరేష్ అగస్త్య), ఏసుదాస్ (సత్య) రూమ్ మేట్స్. ఇందులో బాబు, ఏసుదాస్ కొరియర్ బాయ్స్ గా పనిచేస్తుంటారు. ఒకరోజు ఏసుదాస్ ఇచ్చిన ఒక ఐడియా విని అది ఫాలో అవుతాడు బాబు. దానివల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్నుండి బయటపడదామనుకునేలోపే మరో ఇబ్బందిలో కూరుకుపోతాడు. తను మాత్రమే కాక తన స్నేహితులు కూడా ఇందులోకి వచ్చి ఇరుక్కుంటారు. మత్తు వదలరా సినిమా మొత్తం వీరు తమకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు, వాటి పర్యావసానాలు ఏంటి అన్న పాయింట్ మీదే నడుస్తుంది.

నటీనటులు:
కీరవాణి కొడుకు శ్రీ సింహా ఉన్నంతలో బాగానే చేసాడు. అయితే అతను ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పాత్రవరకూ కన్ఫ్యూజన్ లో ఉన్న పాత్రకు అతను న్యాయం చేసాడనే చెప్పాలి. మరో హీరో నరేష్ అగస్త్య మొదట్లో చాలా డల్ గా ఉన్నట్లు కనిపించాడు. అయితే ప్రీ క్లైమాక్స్ లో ఈ కుర్రాడు అదరగొట్టాడు. ఇక సత్య గురించి చెప్పేదేముంది. తనదైన శైలిలో కామెడీ పండించాడు. తన వన్ లైనర్స్ భలేగా వర్కౌట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత సత్యకు మళ్ళీ అదిరిపోయే రోల్ పడింది. అతుల్య చంద్ర ఉన్నది కాసేపే అయినా ఆకట్టుకుంటుంది.

ఇక మిగిలిన నటులైన బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పావలా శ్యామల తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన వారంతా ఓకే.

సాంకేతిక విభాగం:
మత్తు వదలరా సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కింది. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. చాలా ట్రెండీ ఔట్పుట్ ఇచ్చాడు. గుడ్లగూబ సౌండ్ ను చాలా ఎఫెక్టివ్ గా వాడాడు. కెమెరా వర్క్ కూడా మెప్పిస్తుంది. కొన్ని భిన్నమైన యాంగిల్స్ వాడారు. క్లైమాక్స్ ఫైట్ లో ఇవి కొంత అసహనాన్ని కలిగించవచ్చు. ఎడిటింగ్ పర్వాలేదు, అయితే కొన్ని సన్నివేశాలు మరీ సాగుతున్న భావన కలుగుతున్నాయంటే అది ఎడిటింగ్ లో లోపమే అని చెప్పవచ్చు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ఇక రచయిత, దర్శకుడు రితేష్ రానా విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ కు పంచ్ లు యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు. అయితే అందులో అతను పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చాలా ఆసక్తికరంగా సినిమాను మొదలుపెట్టినా కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.

విశ్లేషణ:
మత్తు వదలరా ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అయితే దర్శకుడు రితేష్ దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంత తడబడ్డాడు. అయితే సత్య సినిమాను నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నం చేసారు. సత్య కామెడీకే టికెట్ డబ్బులు చెల్లిపోతాయంటే అతిశయోక్తి లేదు. కథనాన్ని కొంత వేగంగా నడిపి ఉంటే ఫ్లో లో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకునేవి.
క్లైమాక్స్ ను సాగదీయడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. మొత్తంగా చూసుకుంటే మత్తు వదలరా ఒక ఆసక్తికర కాన్సెప్ట్ కు, సత్య కామెడీకి ఒకసారి చూడవచ్చు.

చివరిగా: మత్తు వదలరా- పూర్తిగా వదలదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Zje8sy

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...