
ఎన్టీఆర్ గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే . అయితే హరికృష్ణ మరణం తర్వాత నందమూరి – నారా కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . దాంతో హరికృష్ణ కూతురు సుహాసిని ని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీకి దింపాడు చంద్రబాబు . బాలయ్య కూడా సుహాసిని వెంట ఉండి నామినేషన్ వేయించాడు . ఇక సుహాసిని సోదరులుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తమవంతు బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది అందుకే ఈనెల 27 , 28 , 29 న మూడు రోజుల పాటు కూకట్ పల్లి లో ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసాడు ఎన్టీఆర్ . బాలయ్య బాబాయ్ తో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కూడా ఈ ప్రచార సభలలో పాల్గొననున్నారు .
English Title: NTR will be campaigning for suhasini from 27th
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2THHKMU
Comments
Post a Comment