Skip to main content

కేసీఆర్ ఆంధ్రోళ్లని తిడుతుంటే ఈ ఆంధ్రోళ్లకు పట్టదా ?

Jagan and Pawan kalyan wants KCR victoryతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల సందర్బంగా ఆంధ్రోళ్ళని ఘోరంగా అవమానిస్తుంటే ఆంద్రోళ్ళయిన జగన్మోహన్ రెడ్డి , పవన్ కళ్యాణ్ లు నోరు మెదపడం లేదు . కేసీఆర్ ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ సాటి ఆంధ్రులైన పవన్ కళ్యాణ్ , జగన్ లు కేసీఆర్ పై పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా చంద్రబాబు ని అదేపనిగా తిడుతున్న కేసీఆర్ అంటే సంబర పడిపోతున్నారు జగన్ , పవన్ లు . చంద్రబాబు నాయుడి ని ఆంధ్రప్రదేశ్ లో అధికార పీఠం నుండి దూరం చేయడానికి ఆ అధికార పీఠం మీద కూర్చోవడానికి జగన్ తహతహలాడుతున్నాడు .

జగన్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఆశ కలిగింది . 2019 ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడు . ఒకవైపు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతుంటే , బలమైన నాయకుడు నరేంద్ర మోడీ ని ఎదురిస్తుంటే కేసీఆర్ , పవన్ కళ్యాణ్ , జగన్ మోడీ తో కుమ్మక్కై చంద్రబాబు పై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అనుంగు సోదరులలా ? తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం మొత్తం చంద్రబాబు ని తిట్టడం , ఆంద్రోళ్ళు ….. ఆంద్రోళ్ళు అంటూ ఆడిపోసుకోవడం తప్ప నేను ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నాకు మళ్ళీ ఓటయ్యేండి అని మాత్రం చెప్పలేక పోతున్నాడు . ఇంతలా ఆంధ్రోళ్ల ని కేసీఆర్ తిడుతుంటే అతడ్ని విమర్శించకుండా లోపాయికారిగా జగన్ పార్టీ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నారు . చంద్రబాబు బలపరుస్తున్న ప్రజా కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఆదేశాలు జారీ చేసాడట . అలాగే జగన్ కూడా తన వాళ్ళని పెద్ద ఎత్తున పురమాయించి కేసీఆర్ ని బలపరచాలని కోరాడట . జగన్ , పవన్ లు కుమ్మక్కై మోడీ – కేసీఆర్ లకు జై కొడుతూ ఆంధ్రోళ్ల పరువు తీస్తున్నారు .

English Title: Jagan and Pawan kalyan wants KCR victory



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2r8GW6N

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...