Skip to main content

`విశ్వామిత్ర’ టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

Nanditha Raj releases Teaser for 'Viswamitra'రాజకిరణ్‌ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యం’ రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ కీలక పాత్రధారులు. రాజకిరణ్‌ దర్శకుడు. మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్‌ నిర్మాతలు. ఫణి తిరుమలశెట్టి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్ లో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్ మీట్‌లో… క‌థానాయిక నందిత మాట్లాడుతూ ‘‘చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. కేవలం గ్యాప్‌ను ఫిలప్‌ చేసుకోవడం కోసం చేయలేదు. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. వైవిధ్యంగా అనిపించింది. స్ర్కిప్ట్‌ నచ్చి చేశాను. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశారు. అఽశుతోష్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. అందమైన థ్రిల్లర్‌ ఇది. న్యజిలాండ్‌లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో సాగుతుంది’’ అని అన్నారు.

దర్శకుడు రాజ్‌కిర‌ణ్‌ మాట్లాడుతూ ‘‘నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాను. కానీ పలువురు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఆ తరుణంలో సంకల్పబలంతో నేను రాజకిరణ్‌ సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే సమయానికి అందరూ సెట్‌ అయ్యారు. డిసెంబర్‌ మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్‌లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలను కూడా మిళితం చేశాం. థ్రిల్లర్‌ తరహా చిత్రం. హారర్‌ కాదుగానీ, కొంచెం హారర్‌ టచ్‌ మాత్రం ఉంటుంది. కథ వినగానే నందిత యాక్సెప్ట్‌ చేశారు. అశుతోష్‌ రాణా ఇందులో మెయిన్‌ విలన్‌గా నటించారు’’ అని అన్నారు.

సత్యం రాజేష్‌ మాట్లాడుతూ ‘‘రాజకిరణ్‌గారు రెండేళ్ల క్రితం ఈ కథ చెప్పారు. పాయింట్‌ హిట్‌ పాయింట్‌ అని అన్నాను. ఒకరోజు ఆయన ఫోన్‌ చేసి మీరే మెయిన్‌ లీడ్‌ అని అన్నారు. ఆ తర్వాత ఈ స్ర్కిప్ట్‌ని చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాం. రాజేష్‌ మెయిన్‌ లీడ్‌ ఏంటి? అని అన్నవారు కూడా ఉన్నారు. అయితే మా నిర్మాతలు రజనీకాంతగారు, మాధవిగారు నమ్మి సినిమా చేశారు. ఫణిగారు కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. హిట్‌ సినిమా తీయడమే ధ్యేయంగా ఉన్నారు మా దర్శకుడు. బడ్జెట్‌ కూడా బాగా పెరిగింది. అయినా వెనుకాడలేదు. విద్యుల్లేఖ రామన్‌ రోల్‌ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రసన్న, అశుతోష్‌, నందిత పాత్రలు చాలా బావుంటాయి’’ అని అన్నారు.

విద్యుల్లేఖ రామన్‌ మాట్లాడుతూ ‘‘శ్రీనివాస కల్యాణం సమయంలో రాజేష్‌ నాకు ఈ కథ గురించి చెప్పి, డేట్లు కావాలన్నారు. వెంటనే అంగీకరించాను. ‘గీతాంజలి’ సమయం నుంచి నేను రాజకిరణ్‌గారికి ఫ్యాన్‌. ఇందులో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాను. నందిత పక్కన కనిపిస్తాను. రాజేష్‌తోనూ మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. ప్రతి ఒక్కరి పాత్రా బావుంటుంది. రియల్‌లైఫ్‌లో జరిగిన ఘటన అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను. డిసెంబర్‌లో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు.

నటీనటులు : విద్యుల్లేఖ రామన్‌, చమ్మక్‌ చంద్ర, గెటప్‌ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్‌ రాఘవ, సి.వి.యల్‌.నరసింహారావు, ఇందు ఆనంద్‌ కీలక పాత్రధారులు.

సాంకేతిక నిపుణులు : ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్‌ బండారి, ఎడిటర్‌: ఉపేంద్ర, యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్‌, శేఖర్‌ మాస్టర్‌, ఆర్ట్‌: చిన్నా, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: రాజకిరణ్‌.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yvWULw

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...