Skip to main content

వైభవంగా నందిగామలో జరిగిన ‘నేనే ముఖ్యమంత్రి’ ప్రీ-రిలీజ్‌!!

Nene Mukhyamantri Pre Release eventస్వలాభం కోసం కాకుండా ప్రజల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో వచ్చే రాజకీయ నాయకుల‌ను మాత్రమే మనం ఎన్నుకోవాల‌నే కథాంశంతో ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రం నిర్మించాం. విద్యార్థులే దేశ భవిష్యత్తు కాబ‌ట్టి , వారు భ‌విష్య‌త్తులో  ఎలాంటి నాయ‌కుణ్ని ఎన్నుకోవాలి? ఎలాంటి నాయ‌కుణ్ని ఎన్నుకోవ‌ద్దు అని మా సినిమా చూసి తెలుసుకుంటార‌ని వారి  సమక్షంలో నందిగామలోని చైతన్య కాలేజ్‌లో మా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు ‘నేనే ముఖ్యమంత్రి’ నిర్మాతల్లో ఒకరైన అట్లూరి నారాయణరావు. శ్రీ వైష్ణవి ఫిలింస్‌, ఆలూరి  క్రియేషన్స్‌ పతాకాల‌పై   అట్లూరి నారాయణరావు , ఆలూరి  సాంబశివరావు సంయుక్తంగా  ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రాన్ని నిర్మించారు. దేవిప్రసాద్‌, వాయు తనయ్‌,  శశి, సుచిత్ర  ప్రధాన పాత్రల్లో మోహన్‌ రావిపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల‌ 8న గ్రాండ్‌ గా విడుదవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ బుధవారం నందిగామలోని చైతన్య కాలేజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

 

ఈ సందర్భంగా అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ…‘‘  మనల్ని పాలించే నాయకుల‌ను  ఎటువంటి వారిని ఎన్నుకోవాలి? ఎటువంటి నాయకును ఎన్నుకోవద్దు ? అనే అంశాన్ని మా చిత్రం ద్వారా  చూసిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో  నిస్వార్థంతో సేవ చేసే నాయకులు మనకు అవసరం. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనదే అనేది మా సినిమాలో చూపించాం.  ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు.

 

 

మరో నిర్మాత ఆూరి సాంబశివరావు మాట్లాడుతూ…‘‘మా చిత్రం లో సమకాలీన రాజకీయ అంశాల‌ గురించి చర్చించాం.  అన్ని వర్గాల‌కు నచ్చే అంశాల‌తో పాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి.  పదవి కోసం ఆరాటపడే నాయకుల‌ను  కాకుండా బాధ్యతతో పని చేసే వారికే పట్టం కట్టాల‌ని చెప్పే చిత్రమిది. ఈ నెల‌ 8న విడుద చేస్తున్నాం. మా సినిమాను సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

 

దర్శకుడు మోహన్‌ రావిపాటి మాట్లాడుతూ..‘‘మన అభివృద్ధి కోసం..మనకు ఎలాంటి నాయకుడు అవసరమో…ఎలాంటి నాయకు అవసరం లేదో తేల్చి చెప్పే సినిమానే ‘నేనే ముఖ్యమంత్రి’. అవినీతి పరుల‌ను కాకుండా నిజాయితీ పరును ఎన్నుకోండి… అని చెబుతూ ఒక మంచి సినిమాను చేసాం. ప్రతి ఒక్కరూ చూసి మా సినిమాను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

 

నందిగామ మున్సిపల్‌ ఛైర్మన్‌ పద్మావతి మాట్లాడుతూ…‘‘ఎల‌క్షన్స్‌ సమీపిస్తోన్న తరుణంలో సరైన చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతల‌ను అభినందిస్తూ…సినిమా విజయవంతం కావాని’’ అన్నారు.

 

సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్‌ మాట్లాడుతూ…‘‘ డైరక్టర్‌ మోహన్‌గారికి ట్యూన్‌, లిరిక్‌ సెన్స్‌ ఉండటంతో మంచి పాట‌ల‌తో పాటు, నేపథ్య సంగీతం ఇవ్వగలిగాను’’ అన్నారు.

నటుడు శశి మాట్లాడుతూ..‘‘ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు.

మరో నటుడు వాయుతనయ్‌ మాట్లాడుతూ…‘‘నాకిదే తొలి సినిమా. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ సినిమాలో చేసాను’’ అన్నారు.

 

చైతన్య కాలేజ్‌ చైర్మన్‌ జ్యోతి, రమేష్‌ దంపతులు మాట్లాడుతూ…‘‘ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా ఫంక్షన్‌ మా కాలేజ్‌లో జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాని కోరుకుంటున్నాం’’ అన్నారు.

 

దేవిప్రసాద్‌, వాయు తనయ్‌, శశి, సుచిత్ర, నళిని కాంత్‌, రామరాజు, శుభలేఖ సుధాకర్‌   తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫణి కళ్యాన్‌, కెమెరాఃకమలాకర్‌, రచన సహకారంః హిరణ్మయి-సత్య జేబి, నిర్మాతలుః అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు;  రచన-దర్శకత్వంః మోహన్‌ రావిపాటి.

 

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Djruu4

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...